ప్రధాని మోడీ పిలుపుకు సహకరించండి
డోన్ ఏప్రిల్ 05
ఆదివారం రాత్రి 9 గంటలకు ఇంట్లో లైట్లు ఆర్పి క్యాండిల్ లైట్ వెలిగించాలని డోన్ పట్టణ విద్యుత్ ఏ ఈ మల్లయ్య తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సామాజిక దూరం ఉండడం కోసం లాక్ డౌన్ నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి మోడీ అదివారం రాత్రి 09 గంటలకు 09 నిమిషాలకు ఇంట్లో లైట్లు ఆర్పి క్యాండిల్ లేదా సెల్ లైట్ వేసుకొని మన కోసం పని చేస్తున్న వివిధ శాఖల అధికారులకు కృతజ్ఞతలు తెలపాని పిలుపునిచ్చారన్నారు. ఇందుకు పట్టణ ప్రజలు సహకరించాలని కోరారు.