కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం విఫలం: యనమల
అమరావతి ఏప్రిల్ 05
కరోనా నియంత్రణ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. పాలకుల ఉదాసీనత వల్ల రాష్ట్రంలో కరోనా ఎక్కువైందన్నారు. ఈ క్రమంలోనే యనమల ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు.‘‘వైద్యారోగ్యశాఖకు కేటాయించిన.. రూ.11,399 కోట్లలో ఎంత ఖర్చు పెట్టారు? టీడీపీ మెడ్టెక్ జోన్ పెట్టకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి? కరోనా నిరోధానికి నిధులు ఎందుకివ్వరు? కేంద్రం ఇచ్చిన నిధులన్నీ ఏం చేశారు?’’ అని యనమల ప్రశ్నించారు. పోలవరం సహా అన్ని ప్రాజెక్టుల పనులు నిలిపేశారని విమర్శించారు. లాక్డౌన్కు వైసీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విపత్తులోనూ ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇస్తారా అని యనమల ప్రశ్నించారు.