దేశ వ్యాప్తంగా ఈ కామర్స్ పోర్టల్ లో నెంబర్ 1 గా ఉన్న ఫ్లిప్ కార్ట్ ను కనుగోలు చేసెందుకు అమెరికాకి చెందిన అమేజాన్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఫ్లిప్ కార్ట్ ను కనుగోలు చేసి ఇండియా మార్కెట్ లో పాగా వేయాలని అమేజాన్ చూస్తుంది. ఈ విషయం తో సంబంధం ఉన్నఇద్దరు వ్యక్తులు ఈ సమాచారం ని మీడియా కి చెరవేశారు. ప్రపంచం లో అతి పెద్ద రిటైలర్ గా ఉన్న వాల్ మార్ట్ కూడా ఫ్లిప్ కార్ట్ లో 55 శాతం షేర్ కోసం చర్చలు నిర్వహించింది.