బలమైన దేశం కోసం బలమైన బిజెపి
హైదరాబాద్ ఏప్రిల్ 6
బలమైన దేశం కోసం బలమైన బిజెపి అనే నినాదంతో పార్టీని మరింత పటిష్టపరచాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం నాడు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని కార్యకర్తలు ఘనంగా జరిపారు. పార్లీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా సందేశం మేరకు ఉదయం పది గంటలకు పార్టీ కార్యాలయలన్నింటి పార్టీ జెండా ఎగరవేసారు. డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. పోలీసులు, డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, బ్యాంకు, పోస్టల్ ఉద్యోగులు, ప్రభుత్వ, స్థానిక సంస్థల ఉద్యోగులకు థాంక్యూ లెటర్ల ను అందజేసారు. లాక్ డౌన్ ముగిసే వరకు బీజేపీ పార్టీ కార్యకర్తలు, అభిమానులు అన్నదానం, సేవ కార్యక్రమాల్లో పాల్గొనాలని అయన సూచించారు.