YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సర్కార్ చాలా విషయాలు దాస్తోంది

సర్కార్ చాలా విషయాలు దాస్తోంది

సర్కార్ చాలా విషయాలు దాస్తోంది
అమరావతి ఏప్రిల్ 6 
 కరోనా వ్యాప్తి, నియంత్రణ  విషయంలో వైఎస్ జగన్ సర్కార్ చాలా విషయాలు దాస్తోందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ  ఆరోపించారు. సోమవారం నాడు అయన  మీడియాతో మాట్లాడారు. పేదలకు ఇచ్చే సాయాన్ని ప్రభుత్వమే పంపిణీ చేయాలి. ప్రభుత్వ డబ్బును వైసీపీ స్థానిక ఎన్నికల అభ్యర్థులు పంచుతున్నారు. వీళ్ల తాత సొమ్మని వైసీపీ కార్యకర్తలు పంచుతున్నారా?. రాష్ట్రంలోని సమస్యలను లేఖల ద్వారా సీఎం దృష్టికి తీసుకెళ్తున్నాను. కరోనాకు వ్యతిరేకంగా ప్రతి కార్యకర్త పోరాడాలి. వైసీపీ నేతలకు మంచి బుద్ధి ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నానని అయన అన్నారు. . నాతో పాటు ప్రతి బీజేపీ కార్యకర్త ఇవాళ ఉపవాసం ఉంటారు. ఉపవాసం వల్ల మిగిలిన భోజనాన్ని పేదలకు అందజేస్తాం. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తరుణంలో బిజెపి కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని  కన్నా అన్నారు.
 

Related Posts