YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కరోనా నియంత్రణకు కేంద్రం మరో ప్రణాళిక

కరోనా నియంత్రణకు కేంద్రం మరో ప్రణాళిక

కరోనా నియంత్రణకు కేంద్రం మరో ప్రణాళిక
న్యూ ఢిల్లీ ఏప్రిల్ 6 
భారత్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుంది. దేశంలో కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ ను విధించినప్పటికీ కూడా ..కరోనా వేగంగా విస్తరిస్తుండటం తో ప్రజల్లో ఆందోళన మొదలైంది. కరోనా వైరస్ నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో  బృహత్తర ప్రణాళికను సిద్దం చేసింది. కరోనావైరస్ మరిన్ని ప్రాంతాలకు కరనా విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ఆరోగ్య శాఖ వ్యూహాత్మక కార్యాచరణ సిద్ధం చేసింది.ఇకపోతే ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4314 కరోనావైరస్ పాటిటివ్ కేసులు నమోదు కాగా మొత్తం మరణాల సంఖ్య 118 కు చేరింది. గడిచిన 12 గంటల్లోనే ఏకంగా 500  మందికి పైగా ఈ కరోనా వైరస్ సోకింది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - మహారాష్ట్ర - కేరళతో సహా 9 రాష్ట్రాల్లోని 211 జిల్లాలలో కరోనా  కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో జన సంచారం లేకుండా చేయాలనీ తెలిపింది. అలాగే  ఆయా ప్రాంతాలకు పూర్తిగా రాకపోకల రద్దు చేయాలని తెలిపింది. చివరి కరోనా  కేసు నమోదైన తర్వాత 4 వారాల వరకు.. కొత్తగా ఏలాంటి పాజిటివ్ కేసు నమోదు కానట్లయితే అప్పుడు మాత్రమే ఆయా ప్రాంతాలలో నెమ్మదిగా సడలింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అలాగే పాజిటివ్ కేసులుగా నమోదైన వారినందరినీ ఆస్పత్రులకు తరలించాలని చెప్పింది. అలాగే రెండు సార్లు జరిపే రక్త పరీక్షలు నెగటివ్ గా వస్తేనే ..పేషెంట్లను ఆసుపత్రుల నుంచి ఇళ్లకు పంపాలి అని ఆలా కాకుండా  కొద్దిపాటి కోరనా లక్షణాలు ఉన్న వాళ్లని స్టేడియంలలో ఏర్పాటు చేసిన క్వారెంటైన్ కేంద్రాలకు పంపాలి అని అలాగే  కొంచెం ఎక్కువ కరోనా లక్షణాలు ఉన్నవాళ్లను అసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డులలో ఉంచాలి అని తెలిపింది. అలాగే  కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను దిగ్బంధం చేయడంతో పాటు ఆ ప్రాంతాల నుంచి పక్క ప్రాంతాలకు కరోనా వ్యాప్తి చెందకుండా అంచెల వారి  రక్షణ ఏర్పాట్లు చేసుకోవాలి అని తెలిపింది.ఇకపోతే పాఠశాలలు - కళాశాలలు - ఇతర కార్యాలయాలను చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా మూసివేయాలి. ఈ ప్రాంతాలలో ప్రభుత్వ - ప్రైవేట్ రవాణా ను స్తంభింప చేయాలి. కేవలం నిత్యావసర - అత్యవసర సర్వీసులను మాత్రం అనుమతించాలి అని తెలిపింది. కరోనా వ్యాప్తిని కట్టడి చేయాలంటే దేశంలోని వివిధ ప్రాంతాల్లో .. వివిధ విధానాలను అవలంబించాలి. వైద్య సిబ్బంది - డాక్టర్లు - నర్సులు - పారా మెడికల్ సిబ్బందికి కట్టుదిట్టమైన సర్జికల్ గౌన్లు - మాస్కులు - గ్లోవ్స్ లాంటి ..మూడు రకాలైన వ్యక్తిగత సంరక్షణ పరికరాలు వినియోగించాలి. కరోనా కేసులు నమోదైన ప్రాంతాలను హాట్ స్పాట్లు గా గుర్తించాలి. ఖచ్చితమైన చర్యలు తీసుకునే బాధ్యతను ..సంబంధిత జిల్లా మెజిస్ట్రేట్లకు అప్పగించాలి.

Related Posts