YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

6 ఏళ్ల కనిష్టానికి పతనమైన బంగారం.

6 ఏళ్ల కనిష్టానికి పతనమైన బంగారం.

6 ఏళ్ల కనిష్టానికి పతనమైన బంగారం.
ముంబై, ఏప్రిల్ 7
బంగారం కొనేవారు కరువయ్యారు. పసిడి దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. బంగారం ధర గరిష్ట స్థాయిల్లో కొనసాగుతుండటం ఇందుకు ప్రధాన కారణం. కరోనా వైరస్ వల్ల కూడా పసిడిపై ప్రతికూల ప్రభావం పడింది.దేశంలో బంగారం దిగుమతులు భారీగా క్షీణించాయి. మార్చి నెలలో వార్షిక ప్రాతిపదికన చూస్తే ఏకంగా 73 శాతం పడిపోయాయి. ఆరున్నరేళ్లలో ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. బంగారం దిగుమతులు పడిపోవడానికి ప్రధాన కారణం దేశీ మార్కెట్‌లో పసిడి ధర గరిష్ట స్థాయిలో ఉండటం. అంతేకాకుండా కరోనా వైరస్ లాక్ డౌన్ వల్ల డిమాండ్ పడిపోవడం కూడా పసిడి దిగుమతులు పడిపోవడానికి మరో కారణంగా ఉంది.బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల జాబితాలో భారత్ రెండో స్థానంలో ఉంది. మార్చి నెలలో దేశంలోకి బంగారం దిగుమతులు 25 టన్నులుగా ఉన్నాయి. గత ఏడాది మార్చి నెలలో బంగారం దిగుమతులు 93.24 టన్నులుగా ఉండటం గమనార్హం.మరోవైపు బంగారం ధర విషయానికి వస్తే.. హైదరాబాద్ మార్కెట్‌లో మంగళవారం బంగారం ధర స్థిరంగా ఉంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.40,030 వద్దనే నిలకడగా కొనసాగుతోంది. 24 క్యారెట్ల బంగారం ధర కూడా 10 గ్రాములకు స్థిరంగానే ఉంది. రూ.44,030 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది.పసిడి ధర నిలకడగా కొనసాగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. కేజీ వెండి ధరలో కూడా ఎలాంటి మార్పు లేదు. దీంతో వెండి ధర రూ.40,360 వద్దనే స్థిరంగా ఉంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ స్తబ్దుగా ఉండటం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర ఔన్స్‌కు 2.29 శాతం పైకి కదిలింది. దీంతో బంగారం ధర 1732 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.70 శాతం పెరుగుదలతో 15.73 డాలర్లకు ఎగసింది.

Related Posts