ఖర్చులు తగ్గించుకోండి : సోనియా సలహా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 7
కోవిడ్-19 కట్టడి కోసం ఐదు సూచనలు చేస్తూ.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఖర్చు తగ్గించుకొని.. ఆ మొత్తాన్ని కరోనాపై పోరాటానికి మళ్లించాలని ఆమె ప్రధానికి సూచించారు. కరోనా పోరాటానికి సలహాలు, సూచనలు ఇవ్వమని ప్రధాని టెలీఫోన్ ద్వారా కోరడంతో.. సోనియా ఐదు సలహాలతో కూడిన లేఖను మోదీకి రాశారు. వచ్చే రెండేళ్లపాటు మీడియా (టీవీ, ప్రింట్, ఆన్లైన్)కు ప్రభుత్వం రెండేళ్లపాటు ప్రకటనలు ఇవ్వడాన్ని పూర్తిగా నిషేధించాలని సోనియా సూచించారు.రూ. 20 వేల కోట్ల వ్యయం అయ్యే నూతన పార్లమెంట్ సెంట్రల్ విస్టా సుందీరకరణ, నిర్మాణ ప్రాజెక్ట్ను నిలిపేయాలని సోనియా గాంధీ ప్రధానిని కోరారు. ప్రస్తుతమున్న పార్లమెంట్ భనవంలోనే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమావేశాలను నిర్వహించుకోవచ్చని ఆమె తెలిపారు. కొత్త పార్లమెంట్ భవనాన్ని అత్యవసరంగా నిర్మించాల్సిన అవసరం లేదన్నారు. అధికారిక విదేశీ ప్రకటనలను వాయిదా వేసుకోవాలని ప్రధానికి సోనియా గాంధీ సూచించారు. ఎంపీల జీతాలను 30 శాతం తగ్గించాలని సోమవారం కేంద్ర కేబినెట్ నిర్ణయించగా.. కాంగ్రెస్ అధినేత్రి ఈ నిర్ణయానికి మద్దతు పలికారు. పీఎం కేర్ ఫండ్కు వచ్చిన విరాళాలను పీఎం రిలీఫ్ ఫండ్కు బదిలీ చేయాలని ఆమె సూచించారు.కరోనా సంక్షోభం నివారణకు సలహాలు, సూచనలు కోరుతూ ప్రధాని మోదీ.. ఇద్దరు మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులతో ఫోన్ ద్వారా చర్చించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, శిరోమణి అకాలీదల్ నేత ప్రకాశ్ సింగ్ బాదల్ తదితరులకు కూడా మోదీ ఫోన్లు చేశారు