YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

15 నుంచి మేఘాలయలో లాక్ డౌన్ ఎత్తివేత

15 నుంచి మేఘాలయలో లాక్ డౌన్ ఎత్తివేత

15 నుంచి మేఘాలయలో లాక్ డౌన్ ఎత్తివేత
షిల్లాంగ్, ఏప్రిల్ 7
కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు భారత ప్రధాని నరేంద్రమోదీ 21 రోజుల పాటు లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు దేశం అంతటా లాక్ డౌన్ అమల్లో ఉంది. ముందుగా మోదీ చెప్పిన ప్రకారం లాక్‌డౌన్ మరో వారం రోజుల్లో ముగియనుంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో కేసుల తీవ్రత నేపథ్యంలో ఈ లాక్‌డౌన్ షెడ్యూల్ మరింత పొడిగించాలని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ జూన్ 2వరకు పొడిగించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అవసరమైతే మరో నెల రోజుల పాటు అయినా ఈ లాక్ డౌన్ పొడిగించక తప్పని పరిస్ధితులు ఏర్పడుతున్నాయన్నారు కేసీఆర్.మరోవైపు, ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ మాత్రం లాక్ డౌన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 15 నుంచి లాక్ డౌన్ నిబంధనలను సడలించబోతున్నామని... అన్ని కార్యాలయాలు యథాతథంగా పని చేస్తాయని ఆ రాష్ట్రం ప్రకటించింది. ప్రైవేట్ వ్యాపారాలపై మాత్రం నిషేధం ఉంటుందని తెలిపింది. ఈ నెల 15వ తేదీ నుంచి సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటించింది. ఈ నెల 15వ తేదీ నుంచి పాఠశాలలు, విద్యాసంస్థలు మినహా అన్ని రకాల సేవలు అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేసింది.రోడ్లపై అన్ని వాహనాలను అనుమతిస్తామని, వ్యవసాయ కార్యకలాపాలు కొనసాగుతాయని మేఘాలయ ప్రభుత్వం తెలిపింది. మేఘాలయలో ఇంత వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. దీంతో, లాక్ డౌన్ ఆంక్షలను సడలించేందుకు ఆ రాష్ట్రం సిద్ధమవుతోంది. అయితే వైద్య అధికారుల సూచనలను గ్రామీణ ప్రాంత ప్రజలు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది.కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జనజీవనానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రకటన చేసింది. లాక్‌డౌన్ మరింత కాలం కొనసాగితే వచ్చే ఇబ్బందుల నేపథ్యంలో తాము దీనిని పొడిగించాలనుకోవడం లేదని ప్రకటన చేసింది.మరోవైపు దేశవ్యాప్తంగా కొన్నిరాష్ట్రాల్లో మాత్రం లాక్ డౌన్ పొడింగపు తప్పేలా లేదు. తెలంగాణతో పాటు మహారాష్ట్ర, తమిళనాడు లాంటి రాష్ట్రాల్లో కేసులు స్వైరవిహారం చేస్తుండడంతో లాక్ డౌన్ పొడిగించక తప్పని పరిస్థితులే ప్రస్తుతం ఉన్నాయి. ఇక మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే సైతం లాక్‌డౌన్ పొడిగించాల్సిందే అని ప్రకటన చేశారు. అయితే మేఘాలయా రాష్ట్రం మాత్రం తాము 15వ తేదీన లాక్‌డౌన్‌ను ఎత్తేయబోతున్నట్లు ప్రకటించింది.
 

Related Posts