YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మర్కజ్‌ టు హైదరాబాద్.. మసీదులో రహస్యంగా ఆశ్రయం, విదేశీయుల అరెస్ట్

మర్కజ్‌ టు హైదరాబాద్.. మసీదులో రహస్యంగా ఆశ్రయం, విదేశీయుల అరెస్ట్

మర్కజ్‌ టు హైదరాబాద్.. మసీదులో రహస్యంగా ఆశ్రయం, విదేశీయుల అరెస్ట్
హైద్రాబాద్, ఏప్రిల్ 7 
లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊరట పొందుతున్న తరుణంలో ఢిల్లీ నిజాముద్దీన్‌లోని మర్కజ్ భవన్‌ ఘటన రేపిన కలకలం అంతా ఇంతా కాదు. ఈ మత సమావేశాల అనంతరం భారత్‌లో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగాయి. మరణించిన వారిలోనూ అధిక మంది అక్కడి వెళ్లొచ్చిన వారే ఉన్నారు. దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు, రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు వీరి కారణంగా కరోనా వైరస్ వ్యాపించింది.టూరిస్టు వీసాలతో దేశంలోకి వచ్చిన కొంత మంది తబ్లిగీ జమాత్ కార్యకర్తలు నిబంధనలకు విరుద్ధంగా ఈ మత కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఇలాంటి వారిలో కొంత మంది తమపై కేసులు నమోదు చేస్తారనే భయంతో రహస్యంగా ఆయా ప్రాంతాల్లో స్థానికుల సాయంతో ఆశ్రయం పొందుతున్నారు. హైదరాబాద్‌లో వెలుగు చూసిన ఘటన ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది.ఢిల్లీలోని మత ప్రార్థనలకు వెళ్లొచ్చి కొంత మంది మలేషియా వాసుల రహస్యంగా నగరంలోని మసీదులో తలదాచుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలు అందించిన పక్కా సమాచారంతో బంజారాహిల్స్ పోలీసులు అక్కడికి చేరుకొని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. నిందితుల్లో హమీద్‌ బిన్‌ జేహెచ్‌ గుజ్లీ, జహ్‌రాతులామనీ, వరాహ్మద్‌ అల్‌ బక్రీ బిన్‌వాన్‌, ఏబీడీ మనాన్‌ జమాహ్‌ బిన్టీ అహ్మద్‌, ఖైరిలీ అన్వర్‌ బన్‌ అబ్దుల్‌ రహీం, జైనారియాల్‌ బిన్డీ ఎండీ నూర్‌ ఉన్నారు.మలేషియాకు చెందిన వీరంతా టూరిస్ట్‌ వీసాపై భారత్ వచ్చి నిజాముద్దీన్‌ మర్కజ్‌ మసీదులో జరిగిన ప్రార్థనల్లో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు వచ్చి ఫిలింనగర్‌ సమీపంలోని హకీంపేటలో ఓ మసీదులో తలదాచుకుంటున్నారు. బంజారాహిల్స్ పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 5) వీరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించారు. వారి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. రిపోర్టులు రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు.

Related Posts