YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం ఆంధ్ర ప్రదేశ్

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు

ముగిసిన శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాలు
తిరుమల ఏప్రిల్ 7 
తిరుమలలోని శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండపంలో గత మూడురోజులపాటు జ‌రిగిన‌ సాలకట్ల వసంతోత్సవాలు మంగ‌ళ‌వారంనాడు ముగిశాయి. తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయదేవేరులతో క‌లిసి వసంతోత్సవంలో పాల్గొనగా చివరిరోజున శ్రీ‌దేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పాల్గొన్నారు.  కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు.

Related Posts