YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

2 వేలు పెరిగిన బంగారం ధర

2 వేలు పెరిగిన బంగారం ధర

2 వేలు పెరిగిన బంగారం ధర
ముంబై, ఏప్రిల్ 7
బంగారం ధర పరుగులు పెడుతోంది. భారీ పెరుగుదలతో దూసుకెళ్తోంది. ఒక్క రోజులోనే ఏకంగా రూ.2,000 దూసుకెళ్లింది. దీంతో పసిడి ధర సరికొత్త ఆల్‌టైమ్ రికార్డు‌ను క్రియేట్ చేసింది. రూ.46 వేల దిశగా ర్యాలీ చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరగడం ఇందుకు ప్రధాన కారణం.ఎంసీఎక్స్ మార్కెట్‌లో జూన్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు ఏకంగా 3.5 శాతం (దాదాపు రూ.2,000) పెరిగింది. దీంతో ధర రూ.45,724 స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ర్యాలీ చేస్తుంటడం ఇందుకు కారణం. కరోనా వైరస్ నేపథ్యంలో ఇన్వెస్టర్లు సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారం వైపు మొగ్గు చూపడం పసిడి జోరుకు దోహదపడింది. వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా 5 శాతం పైకి కదిలింది. కేజీకి వెండి ధర రూ.43,345కు చేరింది.అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరిగింది. బంగారం ధర ఏకంగా 1700 డాలర్ల మార్క్ పైన కదలాడుతోంది. ఈరోజు బంగారం ధర ఔన్స్‌కు 0.5 శాతం పెరుగుదలతో 1702 డాలర్ల వద్ద కదలాడుతోంది. ఇక వెండి ధర కూడా ఇదే దారిలో నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 3.37 శాతం పెరుగుదలతో 15.68 డాలర్ల వద్ద ఉంది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts