YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల మీద లేదు’

ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల మీద లేదు’

ఎన్నికల మీద ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల మీద లేదు’
గుంటూరు ఏప్రిల్ 8 
కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీజేపీ లీగల్ సెల్ రాష్ట్ర కన్వీనర్ జూపూడి రంగరాజు విమర్శించారు. ఎన్నికల మీద ఉన్న శ్రద్ధ ప్రజల ప్రాణాల మీద లేదని సీఎం జగన్ పై  నిప్పులు చెరిగారు. బుధవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. జగన్ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతోందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైసీపీ ఎన్నికల ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ను  రద్దు చేయాలని రంగరాజు డిమాండ్ చేశారు. మళ్లీ కొత్త నోటిఫికేషన్ తో ఎన్నికలు నిర్వహించాలన్నారు.

Related Posts