YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్ డౌన్ పొడిగించడంపైనే దృష్టి

లాక్ డౌన్ పొడిగించడంపైనే దృష్టి

లాక్ డౌన్ పొడిగించడంపైనే దృష్టి
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 
దేశంలో కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఏప్రిల్ 14తో ముగియనుండగా.. పలు రాష్ట్రాలు దీనిని పొడిగించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సూచించాయి. కొన్ని రాష్ట్రాలు స్వచ్ఛందంగానే తాము లాక్‌డౌన్ కొనసాగిస్తామని నిర్ణయించాయి. ఏప్రిల్ 14 తర్వాత కూడా తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని కొన్ని రాష్ట్రాలు సంకేతాలు ఇచ్చాయి. తాజాగా, ఒడిశా కూడా అదే మార్గంలో పయనిస్తోంది. ఏప్రిల్ 30 వరకు తమ రాష్ట్రంలో లాక్‌డౌన్ కొనసాగుతుందని క్యాబినెట్ సమావేశం అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు.అంతేకాదు, ఏప్రిల్ 30 వరకు రైలు, విమాన సర్వీసులను కూడా పునరుద్దరించరాదని కేంద్రానికి ఆయన విజ్ఞ‌ప్తి చేశారు. జూన్ 17 వరకు విద్యా సంస్థలు మూసేస్తామని నవీన్ వెల్లడించారు. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో అన్ని రాష్ట్రాల కంటే ముందే ఒడిశా సీఎం స్పందించి.. పటిష్ఠ చర్యలు చేపట్టారు. కొన్ని జిల్లాలను లాక్‌డౌన్ చేసి.. రాజధాని భువనేశ్వర్, భద్రక్‌లను 48 గంటలపాటు షట్‌డౌన్ చేశారు.తుఫాన్లు లాంటి విపత్తుల సమయంలోనూ ఒడిశా సీఎం వేగంగా స్పందించి ప్రాణనష్టం జరగక్కుండా చర్యలు చేపడతారు. ఇందుకు ఓ ప్రత్యేక వ్యవస్థనే ఆయన ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కోవిడ్-19 పోరులోనే ఇదే వ్యూహం అనుసరిస్తున్నారు.మరోవైపు, ప్రస్తుతం దేశంలో సోషల్‌ ఎమర్జెన్సీని తలపిస్తున్నాయని, విధిలేని పరిస్థితిలో కఠిన నిర్ణయాలు తీసుకుని, నిరంతర నిఘా ఉంచాల్సి వస్తోందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. చాలా రాష్ట్రాలు, జిల్లా యంత్రాంగాలు లాక్‌డౌన్‌ను కొనసాగించాలని కోరుతున్నట్టు తెలిపారు. లాక్‌డౌన్‌ను ఒకేసారి ఎత్తివేయమని, దీనిపై ముఖ్యమంత్రులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పార్లమెంట్‌లోని వివిధ పక్షాల నేతలతో బుధవారం మాట్లాడారు. లాక్‌డౌన్‌ పొడిగింపు వంటి అంశాలపై ప్రధాని మోదీ ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించనున్నారు. కరోనా వైరస్ దేశంలో ప్రబలిన తర్వాత సీఎంలతో ఆయన మాట్లాడనుండడం ఇది మూడోసారి. లాక్‌డౌన్‌ పొడిగించాలని వినతులు వస్తున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది.
 

Related Posts