YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 మరో ఆర్ధిక ప్యాకేజీ

 మరో ఆర్ధిక ప్యాకేజీ

 మరో ఆర్ధిక ప్యాకేజీ
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9 
దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించడానికి కేంద్రం 21 రోజుల లాక్‌డౌన్ విధించడంతో ఆర్దిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఇబ్బందుల నుంచి ప్రజల నుంచి బయటపడేయడానికి ఇప్పటికే కేంద్రం రూ.1.75 లక్షల కోట్ల ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, కేంద్ర ప్రభుత్వం అతి త్వరలోనే మరో ప్యాకేజీని ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. దాదాపు రూ.లక్ష కోట్లకుపైగా విలువైన ఆర్థిక ఉద్దీపన పథకాన్ని ప్రకటించనుందని సమాచారం. సూక్ష్మ, మధ్య తరహా వ్యాపార సంస్థలకు వడ్డీ రాయితీలు, స్థిరాస్తి రంగానికి మినహాయింపులు, ప్రభుత్వరంగ బ్యాంకుల్లో పునః మూలధన సమీకరణకు ప్యాకేజీలో ప్రాధాన్యం ఉంటుందని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా సెక్యూరిటీస్‌ తెలిపింది.
 

Related Posts