YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం విదేశీయం

సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది : ప్రధాని మోదీ

సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది : ప్రధాని మోదీ

సాయానికి భారత్‌ ఎప్పుడూ ముందుంటుంది : ప్రధాని మోదీ
న్యూఢిల్లీ ఏప్రిల్ 9
 కరోనాపై పోరాటానికి మానవతా దృక్పథంతో భారత్‌ చేయగలిగిన సాయమంతా చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. కరోనా వైరస్‌ను కట్టడి చేసే యాంటి మలేరియా డ్రగ్‌ హైడ్రాక్సీక్లోరోక్వీన్‌ కావాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ భారత్‌ను అడిగిన విషయం తెలిసిందే. అమెరికా కోరిక మేరకు భారత్‌ క్లోరోక్విన్‌ మాత్రలను ఆ దేశానికి సరఫరా చేసింది. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ... అసాధారణ పరిస్థితుల్లో స్నేహితుల మధ్య మరింత సహకారం అవసరమని అన్నారు. హైడ్రాక్సీక్లోరోక్విన్‌పై నిర్ణయం తీసుకున్న భారత్‌కు, ఆ దేశ ప్రజలకు కృతజ్ఞతలు చెబుతున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ట్విట్టర్‌ ద్వారా స్పందిస్తూ... విపత్కర పరిస్థితులే మిత్రులను మరింత దగ్గర చేస్తాయన్నారు. భారత్‌-అమెరికా సంబంధాలు ఇదివరకు ఎన్నడూ లేనంతగా మరింత బలపడుతున్నాయన్నారు. కోవిడ్‌పై పోరాటానికి భారత్‌ చేయగలినంతా చేస్తుందన్నారు. కరోనా వైరస్‌ను కలికికట్టుగా ఎదుర్కొంటూ విజయం సాధిద్దామని పేర్కొన్నారు.

Related Posts