YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

అలీనోద్యమ సదస్సుకకు సుష్మా స్వరాజ్

అలీనోద్యమ సదస్సుకకు సుష్మా స్వరాజ్

అలీనోద్యమ దేశాల మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం అజర్‌ బైజాన్ వెళ్ళారు. ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగుతుంది. సుస్థిర అభివృద్ధి కోసం అంతర్జాతీయ శాంతి  భద్రతలకు మద్దతు, ఇతివృత్తంతో ఈ నెల 5 6  తేదీల్లో ఈ సదస్సు జరుగుతుంది.అజర్‌బైజాన్ విదేశాంగ మంత్రి ఎల్మార్ మమ్మదియరోవ్‌తో బుధవారం సుష్మా స్వరాజ్ ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. పరస్పరం ఆసక్తిగల ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలపై వీరు చర్చిస్తారని పేర్కొంది. ఇంధనం, రవాణా, సామర్థ్య నిర్మాణం తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని వృద్ధి చేసుకునేందుకు ఈ చర్చలు దోహదపడతాయని తెలిపింది.

Related Posts