YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

భార్యను విడిచి ఉండలేక ఆత్మహత్య

భార్యను విడిచి ఉండలేక ఆత్మహత్య

భార్యను విడిచి ఉండలేక ఆత్మహత్య
లక్నో, ఏప్రిల్ 10
భార్యకి దూరంగా ఉండలేక భర్త ఆతహత్మ చేసుకున్న విషాద ఘటన చోటుచేసుకుంది. లాక్‌డౌన్ కారణంగా భార్యని కలుసుకోలేకపోతున్నానన్న బాధతో ఓ యువకుడు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని మధుర జిల్లాలో జరిగింది.మధుర పరిధిలోని రాధా కుంద్ ప్రాంతానికి చెందిన రాకేష్ సోని(32) తన భార్య దూరంగా ఉండడం భరించలేక సూసైడ్ చేసుకున్నాడు. లాక్‌డౌన్‌కి ముందు ఆమె తన పుట్టింటికి వెళ్లినట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ ప్రకటించడంతో ఆమె అక్కడే చిక్కుకుపోయింది. సోనీ తన ఇంట్లోనే ఉండిపోయాడు. తాను భార్య దగ్గరికి వెళ్లలేక.. ఆమెను ఇంటికి తీసుకురాలేక భార్యకి దూరమై మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు.ఇంట్లోనే సీలింగ్ ఫ్యాన్‌కి ఉరి వేసుకుని రాకేష్ సోని ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఆత్మహత్య గల కారణాలపై ఆరా తీశారు. భార్యని విడిచి ఉండలేకే సోనీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ అలోక్ రావు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Related Posts