YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

లాక్‌డౌన్‌లో పారిపోయిన ప్రేమికులు... పెళ్లికి కోర్టు గ్రీన్‌సిగ్నల్.

లాక్‌డౌన్‌లో పారిపోయిన ప్రేమికులు... పెళ్లికి కోర్టు గ్రీన్‌సిగ్నల్.

లాక్‌డౌన్‌లో పారిపోయిన ప్రేమికులు... పెళ్లికి కోర్టు గ్రీన్‌సిగ్నల్.
తిరువనంతపురం, ఏప్రిల్ 10 
కరోనా మహమ్మారి ధాటికి ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి మన దేశంలో సుమారు రెండు వారాలుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేసేందుకు పోలీసులు, అధికారులు కఠినంగా వ్యవహరిస్తుండటంతో అన్ని రంగాల వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. ఈ లాక్‌డౌన్ కారణంగా ప్రేమజంటలు సైతం విరహ వేదనను అనుభవిస్తున్నాయి. రోజూ కలుసుకునే ప్రేమికులైతే లాక్‌డౌన్ తమను విడదీసిందని ఆక్రోశం చెందుతున్నారు. కొందరు ప్రేమికులైతే ఏకంగా ఇంటి నుంచి పారిపోయి పోలీసులకు కొత్త తలనొప్పులు తెస్తున్నారు. కేరళలోని కోజికోడ్‌లో జరిగిన ప్రేమకథ వివరాలిలా ఉన్నాయి.కేరళలోని కోజికోడ్‌కు చెందిన యువతి(21), యువకుడు(23) కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే కులాలు వేరు కావడంతో ఇరు కుటుంబాలు వారి ప్రేమను తిరస్కరించాయి. అయినప్పటికీ ఆ ప్రేమజంట తరుచూ బయట కలుస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే లాక్‌డౌన్ అమలు కావడంతో కొద్దిరోజులుగా వారికి కలుసుకునే అవకాశం కుదరడం లేదు. దీంతో వారం రోజుల క్రితం ఇద్దరూ ఇళ్ల నుంచి పారిపోయారు. దీంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తీవ్రంగా గాలించి ఎట్టకేలకు ప్రేమజంటను పట్టుకున్నారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు వారిద్దరిన కోర్టులో హాజరు పరిచారు.అమ్మాయిని తమకు అప్పగించాలని తల్లిదండ్రులు కోరగా.. యువతి మాత్రం వారితో వెళ్లేందుకు నిరాకరించింది. తాము మేజర్లమని, ఎవరిని పెళ్లి చేసుకోవాలన్నది తన ఇష్టమని వాదించింది. వారి సర్టిఫికెట్లు పరిశీలించిన న్యాయస్థానం ఇద్దరినీ మేజర్లుగా నిర్ధారించి పెళ్లికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఈ ప్రేమజంట లాక్‌డౌన్ సమయంలో బయట తిరుగుతూ తమకు చికాకు తెప్పించిందని, ప్రభుత్వం విధించిన నిబంధనలన్నీ అతిక్రమించిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు.

Related Posts