YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

కేంద్ర మంత్రితో మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్.

కేంద్ర మంత్రితో మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్.

కేంద్ర మంత్రితో మంత్రి ఈటల రాజేందర్ విడియో కాన్ఫరెన్స్.
హైదరాబాద్ ఏప్రిల్ 10 
కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డా. హర్షవర్ధన్ రాష్ట్రాల వైద్య ఆరోగ్యశాఖ మంత్రులతో నిర్వహించిన విడియో కాన్ఫరెన్స్ లో హైదరాబాద్ నుండి మంత్రి ఈటల రాజేందర్ పాల్గోన్నారు. రాష్ట్రం, దేశంలో లో తయారవుతున్న మందులు, వైద్య పరికరాలపై టాక్స్ ఎత్తివేయాలని కోరిన మంత్రి. అదేవిధంగా విదేశాల నుండి దిగుమతి చేసుకొనే వైద్య పరికరాలపై  కస్టమ్స్, టాక్స్ రద్దు చేయాలని కూడా కోరారు.వెంటిలేటర్ లు, ఇతర వైద్య పరికరాలు ఈసీఐఎల్, డీఆర్డీవో  లాంటి సంస్థల్లో తయారుచేసి రాష్ట్రంలకు  అందజేయాలని కోరిన మంత్రి ఈటల రాజేందర్. ఎన్-95 మాస్కులు, పీపీఈ  కిట్స్, టెస్టింగ్ కిట్స్ సాధ్యమైనంత త్వరగా తెలంగాణకి అందజేయాలని కూడా విజ్ఞప్తి చేశారు. వైద్య పరికరాలు మరియు కరోనా నియంత్రణ కోసం వినియోగిస్తున్న వాటిని బ్లాక్ మార్కెట్ చేయకుండా నియంత్రించాలని, వాటినికేంద్ర ప్రభుత్వమే సేకరించి రాష్ట్రాలకు అందించాలని మంత్రి ఈటల కోరారు.  ఇప్పటివరకు తెలంగాణలో కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదు అని, రాష్ట్రంలో 8500 మందికి పరీక్షలు చేస్తే 471 మందికి పాజిటివ్ అని తేలింది,వారందరికీ చికిత్స అందిస్తున్నామని, 45 మంది కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా , 12 మంది చనిపోయినట్లు తెలిపారు. లాక్ డౌన్ పొడిగించే అంశంపై అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోవాలని కూడా మంత్రి సూచించారు.

Related Posts