YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

పార్లమెంటు సభ్యుల కోసం వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ తాత్కాలిక వసతి ని ప్రారంభించిన ప్రధాని!!!

పార్లమెంటు సభ్యుల కోసం వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ తాత్కాలిక వసతి ని ప్రారంభించిన ప్రధాని!!!

న్యూ ఢిల్లీ లో నూతనంగా నిర్మించిన వెస్టర్న్ కోర్ట్ ఎనెక్స్ ను ప్రధాన మంత్రి  నరేంద్ర మోదీ బుధవారం  ప్రారంభించారు.  ఈ భవనం పార్లమెంటు సభ్యులకు తాత్కాలిక వసతి గా ఉంటుంది.  ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ లోక్ సభ స్పీకర్ సుమిత్ర మహాజన్ ఈ ప్రాజెక్టు ను పూర్తి చేయడంలో చేసిన కృషిని ప్రశంసించారు. ఆమె ఎప్పుడూ పార్లమెంట్  సభ్యుల శ్రేయాన్నే దృష్టిలో పెట్టుకొంటారని అన్నారు.  ఈ ప్రాజెక్టు అనుకొన్న సమయానికి లోపలే, అంచనా వేసుకొన్న వ్యయంలోగానే చక్కగా పూర్తి అయిందని ప్రధాన మంత్రి అన్నారు.  ఈ పథకం నిర్మాణంలో పాలుపంచుకొన్న అందరినీ ఆయన అభినందించారు.   పార్లమెంటు సభ్యులు కొత్తగా ఎన్నికైనప్పుడు హోటళ్ళలో ఉండవలసి వస్తోందని, ఇటువంటి సందర్భాలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయని ప్రధాన మంత్రి అన్నారు

Related Posts