YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

24 గంటల్లో 1035 కేసులు

24 గంటల్లో 1035 కేసులు

24 గంటల్లో 1035 కేసులు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 11
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య 7447కు చేరగా.. మరణాల సంఖ్య 239కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. 24 గంటల్లో భారత్‌లో 1035 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని, 40 మంది చనిపోయారని ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. 648 మంది కోలుకున్నారని ప్రకటించింది. మన దేశంలో ఒక్క రోజులో కోవిడ్ కేసులు వెయ్యి దాటడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. కరోనా వైరస్‌పై పోరాటం కోసం భారత్ సన్నద్ధంగా ఉందన్నారు. మనద దేశంలో కోవిడ్-19 కోసం ప్రత్యేకంగా 586 హాస్పిటళ్లు, లక్షకుపైగా ఐసోలేషన్ బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు.శుక్రవారం ఒక్క రోజే 16500 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. ఇప్పటి వరకూ 1.71 లక్షల మందికి టెస్టులు చేశామని ఐసీఎంఆర్ తెలిపింది. అత్యధికంగా మహారాష్ట్రలో 1568 కరోనా కేసులు నమోదయ్యాయి.దేశంలో 67 ప్రయివేట్, 146 ప్రభుత్వ ల్యాబ్‌ల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నామని లవ్ అగర్వాల్ తెలిపారు. సోషల్ డిస్టెన్సింగ్‌తోనే కరోనా కట్టడి సాధ్యం అవుతుందన్నారు. కోవిడ్‌పై పోరాటంలో లాక్‌డౌన్, ఇతర చర్యలు ముఖ్యమన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే మన దేశంలో ఇప్పటి వరకూ 2 లక్షల కేసులు నమోదయ్యేవన్నారు.

Related Posts