YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా

మాజీ ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పిటిషన్‌పై విచారణ వాయిదా
అమరావతి ఏప్రిల్ 13
రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా రమేష్‌కుమార్ తొలగింపు వివాదంపై దాఖలైన పిటిషన్‌ను హైకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌‌పై సోమవారం ఉదయం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణలో భాగంగా ఈ నెల 17లోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రభుత్వానికి న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అనంతరం తదుపరి విచారణను వచ్చే సోమవారానికి హైకోర్టు వాయిదా వేసింది. ఎస్ఈసీ నియామకం అర్హతల మార్పు ఆర్డినెన్స్‌పై హైకోర్టులో పిల్ దాఖలైన విషయం తెలిసిందే. నిబంధనలు మార్చి తనను పదవి నుంచి తొలగించారంటూ జగన్ ప్రభుత్వ నిర్ణయంపై  నిమ్మగడ్డ రమేష్‌కుమార్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. అలాగే రమేష్ కుమార్ తొలగింపుపై టీడీసీ తరపున వర్ల రామయ్య, బీజేపీ తరపున మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్, మాజీ మంత్రి వడ్డే శోభనాధ్రీశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసారు.

Related Posts