YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

 పెరుగుతున్న కరోనా కేసులు

 పెరుగుతున్న కరోనా కేసులు

 పెరుగుతున్న కరోనా కేసులు
న్యూఢిల్లీ ఏప్రిల్ 13
దేశంలో గత 48 గంటల్లో కరోనా కేసులు 24శాతం పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వివరాల మేరకు అంతకు ముందు 48 గంటలతో పోలిస్తే ఈ పెరుగుదల ఒకింత నెమ్మదించింది. అప్పట్లో కరోనా కేసుల పెరుగుదల శాతం 28 శాతం ఉందని పేర్కొంది.  అయితే భారత్ లో కరోనా వ్యాప్తి ఆందోళనకర స్థాయిలో ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. సింగపూర్, జపాన్, పాకిస్థాన్ సహా ఆసియా దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి తీవ్రత భారత్ లో ఎక్కువగానే ఉందని వివరించింది. అదే సమయంలో అమెరికా, ఇటలీ, జర్మనీ దేశాలతో పోలిస్తే భారత్ లో వ్యాప్తి తీవ్రత ఒకింత తక్కువగా ఉందని పేర్కొంది.

Related Posts