YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చేగూరులో రెడ్ అలెర్ట్

చేగూరులో రెడ్ అలెర్ట్

చేగూరులో రెడ్ అలెర్ట్
రంగారెడ్డి ఏప్రిల్ 13
రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగుర్ గ్రామంలో ఇటీవల మరణించిన భారతమ్మ 57 సంవత్సరాలు అనే మహిళ నేపథ్యంలో సోమవారం నాడు ఆమె భర్త బుచ్చయ్య కి అనారోగ్యంగా ఉండడం వల్ల వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. అయనకు  వైద్య పరీక్షలు చేయగా కరుణ వైరస్ పాజిటివ్ గా  వెల్లడైందని రంగారెడ్డి జిల్లా డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ చందు నాయక్ వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా అలెర్ట్  అయిన  వైద్య అధికారుల బృందం మళ్లీ బీహార్ కు చెందిన మూడు కుటుంబాలను మొత్తం ఆరుగురు అనుమానితులను వైద్య పరీక్షల  నిమిత్తం గాంధీ హాస్పిటల్ కి తరలించారు. మళ్లీ చేగూర్ గ్రామ పరిసర ప్రాంతాలకి రెడ్ అలర్ట్ ప్రకటించార  .రాకపోకలను నిలిపివేశారు. రహదారులన్నీ కట్టుదిట్టమైన దిగ్బంధం చేసి భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు .

Related Posts