YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంది: సుప్రీంకోర్టు

ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంది: సుప్రీంకోర్టు

ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉంది: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ ఏప్రిల్ 13
మధ్యప్రదేశ్ గవర్నర్ లాల్జీ టాండన్‌‌ చేసిన చర్యను సుప్రీంకోర్టు సమర్థించింది. మాజీ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సారథ్యంలోని ప్రభుత్వాన్ని మెజారిటీ నిరూపించుకోవాలని ఆదేశించడం సరైందని, బల నిరూపణ చేసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందని అత్యున్నత న్యాయ స్థానం సోమవారం తీర్పునిచ్చింది. జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ మరియు హేమంత్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది.అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పే అధికారం గవర్నర్‌కు ఉంది కానీ, బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించే హక్కు మాత్రం ఆయనకు లేదని అప్పటి కమల్‌నాథ్ సర్కారు సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై సుప్రీం తీర్పునిస్తూ... బల నిరూపణకు ఆదేశించే అధికారం గవర్నర్‌కు ఉందని కీలక తీర్పునిచ్చింది. 1994 లో తీర్పునిచ్చిన ఎస్.ఆర్. బొమ్మై కేసును ఆధారంగా  చేసుకొని బల నిరూపణకు ప్రభుత్వాన్ని ఆదేశించే హక్కు గవర్నర్‌కు ఉంటుందని సుప్రీం కోర్టు సోమవారం స్పష్టం చేసింది. బల నిరూపణే ఏకైక అజెండాగా మార్చి 20 వ తేదీన అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతిని సుప్రీం ఆదేశించిన విషయం తెలిసిందే. బల నిరూపణలో అప్పటి ముఖ్యమంత్రి కమల్‌నాథ్ విఫలం చెందడంతో ముఖ్యమంత్రి పదవికి ఆయన రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
 

Related Posts