YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు దేశీయం

 అన్న చెల్లెలతో రాసలీలలు... బావను చంపేశారు

 అన్న చెల్లెలతో రాసలీలలు... బావను చంపేశారు

 అన్న చెల్లెలతో రాసలీలలు... బావను చంపేశారు
లక్నో, ఏప్రిల్ 13
మానవ సంబంధాలు రోజురోజుకూ దిగజారిపోతున్నాయి. పడక సుఖం కోసం కొందరు పశువుల్లా మారిపోతున్నారు. కట్టుకున్న వాళ్లనే దారుణంగా అంతమొందిస్తున్నారు. వావీవరసలు మరచి అన్నతోనే అక్రమ సంబంధం పెట్టుకుని ఓ యువతి ఆ బంధానికే మచ్చ తెచ్చింది. కామంతో రెచ్చిపోయిన అన్నాచెల్లెళ్లు భర్తను అడ్డు తొలగించేందుకు పక్కా ప్లాన్ రచించారు. భర్త నిద్రపోతున్న సమయంలో గొంతుకోసి అతికిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఆగ్రా జిల్లాలో చోటుచేసుకుంది.ఆగ్రా పరిధిలోని ఖండా గ్రామానికి చెందిన విక్రమ్ ఠాకూర్ నోయిడాలోని ఓ ప్రైవేట్ కంపెనీలో డిజైనర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రవీనా అలియాస్ రాణి, ఏడాదిన్నర కొడుకు ఉన్నారు. కరోనా నేపథ్యంలో గత పదిహేను రోజుల కిందట భార్యాపిల్లలతో సహా విక్రమ్ స్వగ్రామానికి వచ్చాడు. గ్రామంలో అతని ఇంటికి పక్కనే ఉండే రవీనా అన్న ప్రతాప్ నివాసం ఉంటున్నాడు.వావీవరసలు మరచిన ప్రతాప్, రవీనా కొద్దికాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నారు. విక్రమ్ లేని సమయంలో అన్నాచెల్లెళ్లిద్దరూ రాసలీలలు సాగించేవారు. అయితే తమ వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్త విక్రమ్‌ని చంపేయాలని నిర్ణయించుకున్న అన్నాచెల్లెళ్లు దారుణానికి ఒడిగట్టారు. భర్త నిద్రిస్తున్న సమయంలో కత్తితో గొంతుకోసి కిరాతకంగా హత్య చేశారు.రక్తపు మడుగులో మంచంపై పడి ఉన్న విక్రమ్‌ని చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. అన్న వరసయ్యే ప్రియుడితో కలసి భార్యే ఘాతుకానికి పాల్పడినట్లు గుర్తించి రవీనాని అరెస్టు చేశారు. ఆమె అన్న ప్రతాప్ పరారీలో ఉన్నాడు. నిందితురాలు రవీనా పోలీసు విచారణకు సహకరించడం లేదని.. పరారీలో ఉన్న ప్రతాప్ కోసం గాలిస్తున్నామని.. అతను పట్టుబడిన వెంటనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసు అధికారి తెలిపారు

Related Posts