YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం...

జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం...

జాతిని ఉద్దేశించి మోడీ ప్రసంగం...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13
లు సడలింపు?
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. మంగళవారంతో లాక్‌డౌన్ ముగియనున్న నేపథ్యంలో మోదీ ఏం మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది. లాక్‌డౌన్ పొడిగించే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఇటీవలే ప్రధాని మోదీ 13 రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన సంగతి తెలిసిందే. చాలా మంది ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ పొడిగించాలనే ప్రతిపాదనకు మద్దతు తెలిపాయి.లాక్‌డౌన్‌ను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తారని భావిస్తున్నారు. కాగా దేశాన్ని గ్రీన్, రెడ్, ఆరంజ్ జోన్లుగా విభజించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది, గ్రీన, ఆరంజ్ జోన్లలో ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. జీవితంతోపాటు ఆర్థిక వ్యవస్థ కూడా ముఖ్యమే అని అర్థం వచ్చేలా మోదీ చేసిన వ్యాఖ్యలు దీనికి బలం చేకూరుస్తున్నాయిదేశంలో పంట కోతల సీజన్ నడుస్తోన్న నేపథ్యంలో.. వ్యవసాయ పనులకు లాక్‌డౌన్‌తో ఇబ్బంది లేకుండా చూసేలా ప్రధాని ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది. కొన్ని పరిశ్రమలను కూడా 25 శాతం సామర్థ్యం నడిపేందుకు అనుమతి ఇస్తారని భావిస్తున్నారు.

Related Posts