YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ దేశీయం

నిజామాబాద్‌లో వెలుగులోకి, దేశంలో కలకలం!

నిజామాబాద్‌లో వెలుగులోకి, దేశంలో కలకలం!

నిజామాబాద్‌లో వెలుగులోకి, దేశంలో కలకలం!
నిజామాబాద్, ఏప్రిల్ 13
లాక్‌డౌన్‌తో దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని ఊరట పొందుతున్న తరుణంలో ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో మర్కజ్ మసీదులో ప్రార్థనల ఘటన సృష్టించిన ప్రకంపనలు అంతా ఇంతా కాదు. ఈ మత సమావేశాలకు హాజరైన వారి కారణంగా దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలకు కరోనా వైరస్ వ్యాప్తి చెందింది. తెలుగు రాష్ట్రాల్లోని చాలా జిల్లాల్లో కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. నాలుగైదు రోజుల్లోనే కేసులు అమాంతం పెరిగాయి. ఇదే తరహాలో ఇప్పుడు మరో మసీదు ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర ప్రదేశ్‌లోని దియోబంద్‌లో ఓ మసీదులో నిజాముద్దీన్ తరహాలోనే మత సమావేశాలు జరిగినట్లు అధికారుల దృష్టికి వచ్చింది.తెలంగాణలోని నిజామాబాద్‌లో నమోదైన కేసుల ద్వారా ఈ ఘటన వెలుగులోకి రావడం గమనార్హం. మర్కజ్ ప్రార్థనలకు సంబంధించిన ఉదంతం కూడా తొలుత తెలంగాణలోనే బయటపడిన విషయం తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో కేంద్రం.. ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిజామాబాద్ జిల్లాలో  రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. బాధితుల ట్రావెల్ హిస్టరీ గురించి ఆరా తీయగా.. వీరిద్దరూ యూపీలోని దియోబంద్‌లో మసీదులో జరిగిన మత కార్యక్రమంలో పాల్గొని వచ్చినట్లు తేలింది. తెలుగు రాష్ట్రాల నుంచి 1000కి పైగా మంది ఇక్కడికి వెళ్లినట్లు వార్తలు వస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది. వీరంతా దియోబంధుతో పాటు అజ్మీర్ దర్గాను కూడా సందర్శించినట్లు అధికారుల దర్యాప్తులో తేలింది. నిజామాబాదులో నమోదైన కరోనా కేసుల్లో బాధితులిద్దరూ యూపీలోని దియోబంద్ మసీదులో ప్రార్థనలు చేసి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. వీరితో పాటు మరో 20 మంది వరకూ ఇదే మసీదుకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ మసీదుకు వెళ్లొచ్చిన వారి సమాచారాన్ని సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినట్లు తెలుస్తోంది.ఢిల్లీ మర్కజ్ మసీదులో ప్రార్థనలు నిర్వహించిన తబ్లిగీ జమాత్ కార్యకర్తలే ఆ సమావేశాల అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని దియోబంద్‌కు వెళ్లినట్లు సమాచారం. నిజాముద్దీన్ తరహాలోనే యూపీలో ప్రార్థనలు జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం అక్కడ నుంచి పెద్ద సంఖ్యలో రాజస్థాన్‌లోని ఆజ్మీర్ దర్గాను సందర్శించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఘటనపై అధికారులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు.భారత్‌లో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 35 కరోనా మరణాలు సంభవించాయి. దీంతో దేశ వ్యాప్తంగా సోమవారం ఉదయం నాటికి కరోనా మరణాల సంఖ్య 308కు చేరింది. మొత్తం 9,152 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 856 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. భారత్‌‌లో ప్రస్తుతం 7,987 యాక్టివ్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.

Related Posts