YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా పై చక్కర్లు కొడుతున్న కొత్త  చిట్కాలు

కరోనా పై చక్కర్లు కొడుతున్న కొత్త  చిట్కాలు

కరోనా పై చక్కర్లు కొడుతున్న కొత్త  చిట్కాలు
బెంగళూర్,  ఏప్రిల్ 14
కరోనా వైరస్‌ నివారణపై సోషల్ మీడియాలో ఎన్నో సలహాలు, సూచనలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. అయితే, చాలామంది కరోనా వైరస్‌ను పూర్తిగా అంచనా వేయకుండా తమకు తెలిసిన చిట్కాలను వాట్సాప్, ఫేస్‌బుక్‌లలో పోస్టు చేసి ప్రజలను ఇబ్బందుల్లోకి నెడుతున్నారు. కరోనా వైరస్ ఇండియాకు రాకముందే.. కొందరు ఆవు మూత్రం తాగితే మంచిదని, ఆవు పేడలో స్నానం చేస్తే రోగ నిరోధక శక్తి పెరిగి కోవిడ్-19 చచ్చిపోతుందని ఉచిత సలహాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంతేకాదు, రోజూ వేన్నీళ్లతో స్నానం చేస్తే కరోనా దరిచేరదనే ప్రచారం కూడా చేశారు. అయితే, ఇవన్నీ వాట్సాప్‌ యూనివర్శిటీలోని శంకర్ దాదా ఎంబీబీఎస్‌లు రూపొందించిన ఫేక్ మెసేజులు. ఎందుకంటే.. కరోనాకు ఇప్పటివరకు మందు లేదు. ఇంకా కనిపెట్టలేదు కూడా. పైన చెప్పినవన్నీ పాటిస్తే కరోనా సోకదనేది అవాస్తవం.వాట్సాప్‌లో తాజాగా మరో సూచన కూడా వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. నీళ్లు ఎక్కువగా తాగినట్లయితే కరోనా వైరస్ శరీరంలోకి చేరదని ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ప్రతి పావు గంటకు ఒకసారి నీళ్లు తాగుతూ.. మన గొంతును హైడ్రేట్ చేసుకోవాలని, అలా చేస్తే వైరస్ నేరుగా అన్నవాహికలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. అక్కడ విడుదలయ్యే యాసిడ్లు కరోనా వైరస్‌ను చంపేస్తాయని అందులో రాశారు. అయితే, ఇదంతా కట్టుకథ. కరోనా వైరస్ అంత సులభంగా పోయేదైతే ప్రపంచంలో అంతమంది ఎందుకు ప్రాణాలు విడుస్తున్నారు? డాక్టర్లు ఎందుకు శ్రమిస్తున్నారు? పరిశోధకులు ఎందుకు ల్యాబుల్లో కుర్చొని చెమటోడ్చుతున్నారు?నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిదే. కానీ, వైరస్‌ను చంపేంత శక్తి, సుగుణాలు నీటిలో లేవు. లండన్‌ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్‌కు చెందిన క్లినికల్ ఎపిడెమియాలోజిస్ట్ కల్పనా సబాపతి మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్ నాసికా రంథ్రం ద్వారా నేరుగా ఊపిరితీత్తుల్లోకి చేరుతోంది. అది శరీరంలోకి చేరేందుకు చాలామార్గాలు ఉన్నాయి. చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కును తాకినా చాలు.. అది నేరుగా శరీరంలోకి ప్రవేశిస్తోంది’’ అని తెలిపారు.అంటే.. కరోనా వైరస్ గొంతులో ఉంటుందని, నీళ్లు తాగడం ద్వారా దాన్ని కడుపులోకి పంపి చంపేయొచ్చనేది కేవలం అవాస్తవం. మీకు కూడా ఇలాంటి ఫేక్ మెసేజ్ వస్తే వెంటనే ఖండించండి. ఇటీవల టిక్‌టాక్‌లో ఓ వ్యక్తి ఇచ్చిన సలహా విని ఓ కుటుంబం తీవ్ర అస్వస్థతకు గురైంది. కాబట్టి.. సోషల్ మీడియాలో ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’లు చెప్పే ఫేక్ సమాచారాన్ని నమ్మేసి అజాగ్రత్తగా ఉండకండి. ఎందుకంటే.. కరోనా చాలా జిత్తులమారి.

Related Posts