అసమానతలు తొలగించిన అంబేద్కర్
నందికొట్కూరు ఏప్రిల్ 14
భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్.అంబేద్కర్ 129వ జయంతి సందర్భంగా నందికొట్కూరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి నందికొట్కూరు శాసనసభ్యుడు తొగురు ఆర్థర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రపంచంలొనే అత్యంత పెద్ద రాజ్యాంగంను రాసి కుల , మత, జాతి, ప్రాంతీయ భేదాలు లేకుండా, రాజ్యాంగం ముందు అందరూ సమానులే అని ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల కోసం ప్రజాస్వామ్యం అని అంబేద్కర్ నిరూపించారని అన్నారు. వజ్రాయుధం లాంటి ఓటు హక్కును అందరికి సమానం గా కలిపించి, చివరకి ఈ దేశంలొ పుట్టిన మనుషులకే కాదు జంతువులకి కూడా రక్షణ కలిపించే దృఢమైన గొప్ప రాజ్యంగాన్ని రాసిన గొప్ప మేధావి అని కొనియాడారు. భారతదేశ సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అంత లోతుగా అర్థం చేసుకొని అసమానతలను తొలగించాలనే సంకల్పం ఉన్న ఏకైక నాయకుడు డా,,బి.ఆర్.అంబేద్కర్ అని తెలిపారు.