YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు తెలంగాణ

మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ ను బార్ గా మార్చిన అధికారులు

మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ ను బార్ గా మార్చిన అధికారులు

మధిర రెవెన్యూ గెస్ట్ హౌస్ ను బార్ గా మార్చిన అధికారులు
ఖమ్మం ఏప్రిల్14
ఒక వైపు కరోనా కరాళ నృత్యం చేస్తుంటే ఆ ఆంక్షలు ఏమి పట్టించుకోకుండా మద్యం సేవిస్తూ అధికారులు విందు పార్టీలు చేసుకుంటున్నారు. తమకేమీ  పట్టనట్లు అధికారులు ఎంజాయ్ చేస్తున్నారు.ఈ మద్యం విందులో మధిర తహసీల్దార్ సైదులు, ఇద్దరు వీఆర్వోలు, ఈవో ఆర్ డి రాజారావు, సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి, మాటూరు పేట పిహెచ్సి డాక్టర్ శ్రీనివాస రావు గెస్ట్ హౌస్ లో తప్పతాగి తూలుతూ ఎంజాయ్ చేస్తుండగా మీడియాకు కంట పడ్డారు. మీడియా ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో తాసిల్దార్ సైదులు, ఈవో ఆర్ డి రాజారావు పరారు కాగా, బాత్రూంలో దాక్కున్న సబ్ జైలర్ ప్రభాకర్ రెడ్డి మీడియాను తోసుకుంటూ రోడ్డుపై ఉడాయించాడు. మాటూరుపేట పి,.హెచ్.సి డాక్టర్ శ్రీనివాస్ మంచం కింద దాక్కొని పోలీసులకు దొరికిపోయాడు. డాక్టర్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.వారి వాహనాలైన ఓ కారు, రెండు బైక్ లు సీజ్ చేసినారు.వీరికి మద్యం ఎక్సైజ్ సీఐ సప్లై చేస్తుండం గనర్హం. ఇలా అధికారులంతా కలిసి తాగుతూ విందులు చేసుకోవటంతో అసలు వీళ్ళు అధికారులేనా అంటూ ప్రజలు విస్మయానికి గురయ్యారు.

Related Posts