YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

 లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవీ...

 లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవీ...

 

 లాక్‌డౌన్ మార్గదర్శకాలు ఇవీ...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15
దేశంలో కరోనా కట్టడికి విధించిన రెండో విడత లాక్‌డౌన్ మే 3 వరకు కొనసాగనుండగా.. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను కేంద్ర హోం మంత్రిత్వశాఖ విడుదల చేసింది. వ్యవసాయ, ఉద్యానవన విభాగాలకు అనుమతించింది. అన్ని జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సర్వీసులు మే 3 వరకు నిలిపివేయనున్నట్టు తెలిపింది. భద్రత విధులకు తప్ప బస్సు, రైలు మెట్రో సర్వీసులు నిలిచిపోతాయని పేర్కొంది. అత్యవసర వైద్యానికి మినహా అంతర్ రాష్ట్ర, అంతర్ జిల్లా ప్రయాణాలు నిషేధించింది. ఎవరూ సరిహద్దులు దాటడానికి వీల్లేదని స్పష్టం చేసింది.నిత్యావసరాల పంపిణీ మినహా మిగతా అన్ని కార్యక్రమాలకు రద్దుచేసింది. ఎవరైనా చనిపోతే అంత్యక్రియలకు 20 మందికి మించి హాజరుకాకూడదని పేర్కొంది. మాల్స్, థియేటర్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, జిమ్స్, స్పోర్ట్ కాంప్లెక్స్‌లు, బార్స్, ఆడిటోరియంలు మూసివేస్తారు.అలాగే, సామాజిక, రాజకీయ, క్రీడా, ఆధ్యాత్మిక కార్యక్రమాలపై నిషేధం, మతప్రదేశాలలో పెద్ద ఎత్తున ప్రార్థనలను కూడా నిలిపివేసింది. ట్యాక్సీ సర్వీసులకు కూడా అనుమతి నిరాకరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే జరిమానా విధిస్తామని పేర్కొంది.హాట్‌స్పాట్స్, కంటెయిన్‌మెంట్ జోన్‌లలో కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ఆరోగ్య శాఖ గతంలో సూచించిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలి. హాట్‌స్పాట్స్‌, కంటెయిన్‌మెంట్ జోన్‌లను రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలు, జిల్లా యంత్రాంగాలు గుర్తించాలి. ఈ ప్రదేశాలలో సాధారణ కార్యకలాపాలకు అనుమతిలేదని తెలిపింది.ఆరోగ్య కేంద్రం, ఔషధాల విక్రయాలు యధాతథంగా సాగుతాయి. ఔషధ పరిశ్రమలలో ఉత్పత్తికి, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వరంలోని వ్యవసాయ మార్కెటింగ్ కార్యకలాపాలకు అనుమతిచ్చింది. వ్యవసాయ పరికరాలను అద్దెకు ఇచ్చే పరిశ్రమలకు, ఆక్వా ఉత్పత్తులు క్రయ విక్రయాలకు, బ్యాంకు కార్యకలాపాలకు అనుమతించింది. అలాగే, వృద్ధాశ్రమాలు, అనాథశరణాలయాలు నిర్వహణకు ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపింది.

Related Posts