YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆరోగ్యం ఆంధ్ర ప్రదేశ్

కరోనాపై తప్పుడు లెక్కలు

కరోనాపై తప్పుడు లెక్కలు

కరోనాపై తప్పుడు లెక్కలు
 ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం
శ్రీకాకుళం ఏప్రిల్ 15
ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ప్రాణాలు గాల్లో దీపాల్లా మారాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సాధారణ వైద్యం కూడా సరిగా అందడం లేదు. కర్నూలు జిల్లాలో సకాలంలో వైద్యం అందక బాలింత ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరు జిల్లాలో సమయానికి వైద్యం అందక శివ సాగర్ అనే వ్యక్తి చనిపోయాడు. వైద్యానికి పెద్ద పీట వేస్తున్నాం, వేల కోట్లు కేటాయిస్తున్నామని గంభీరమైన ప్రకటనలు చేస్తున్న  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ఈ ఘటనలకు ఏం సమాధానం చెప్తారని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ కళా వెంకట్రావు ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజలకు కనీస వైద్య సదుపాయాలు అందని పరిస్థితి నెలకొంది.  లాక్ డౌన్ మొదలయ్యాక ఈ 22 రోజుల్లో అత్యవసర సేవలు అందక పలువురు ప్రాణాలు కోల్పోయారు. అత్యవసర సేవలకు ప్రజా ప్రతినిధులు, అధికారులు ప్రత్యామ్నాయం చూపడం లేదు. పోయిన ప్రాణాలను పాలకులు తీసుకురాగలరా? వారి కుటుంబాలకు అండగా నిలబడతారా? కరోనా నేపథ్యంలో ప్రజారోగ్యం కోసం పలానా చర్యలు  తీసుకున్నామని ప్రభుత్వం ధైర్యంగా చెప్పగలదా? వైద్య ఆరోగ్యశాఖా మంత్రి ఏనాడైనా ప్రభుత్వాసుపత్రులను సందర్శించారా?  రోగులకు అందుతున్న వైద్యం గురించి వాకబు చేశారా?  ఓ వైపు కరోనా మరోవైపు అత్యవసర సేవలు అందక ప్రజలు ప్రాణాలు కోల్పోతుంటే ముఖ్యమంత్రి, వైద్యశాఖామంత్రికి చీమ కుట్టినట్టయినా లేదు.  మంత్రి ఆళ్ల నాని ఏఏ జిల్లాల్లో ఎన్ని ఆస్పత్రులను సందర్శించారని అయన నిలదీసారు.
వైద్యులను చులకనగా చూస్తున్న ప్రభుత్వం 
వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ పోకడల కారణంగా వైద్యులు ఆస్పత్రులకు రావాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. రక్షణ పరికరాలు అందివ్వకపోయినా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా వృత్తిధర్మం పాటించి ఇన్నాళ్లూ వారు వైద్యం చేశారు.  ప్రాణాలకు తెగించి సేవ చేస్తున్న  వైద్యులకు  దక్కిందేమిటి? వైసీపీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ పోకడల ఫలితంగా పలువురు వైద్యులు , వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ప్రాణాలు పోతున్నాయిని అయన అన్నారు.  ఎన్ 95 మాస్కులు ఇవ్వండని వైద్యులు అడగటం నేరమా? కార్పొరేటర్ నుంచి మంత్రి వరకు అందరూ మాస్కులు, గ్రౌజులు వేసుకుని ఊరంతా తిరుగుతారే... ప్రాణాలకు రక్షణ కల్పించమని వైద్యులు అడిగితే మీకు నచ్చడం లేదా?  వైద్యులంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చులకన భావం కాబట్టే ఇన్ని దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ప్రయివేట్ ప్రాక్టీసు లేకుండా లక్షలాదిమంది ప్రజలకు ఎన్నో ఏళ్లుగా వైద్యం అందిస్తున్న డాక్టర్ సుధాకర్ ని  మాస్కులు ఇవ్వమని కోరినందుకు  సస్పెండ్ చేస్తారా? ప్రాణాలకు తెగించి సేవలందిస్తున్న తమకు కనీస సౌకర్యాలు కల్పించమని కోరిన నగరి మున్సిపల్ కమిషనర్ వెంకట రామిరెడ్డిపై వేటు వేస్తారా అని విమర్శించారు.

Related Posts