YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కరోనా సాయం కోసం ఆలపాటి నిరాహారదీక్ష

కరోనా సాయం కోసం ఆలపాటి నిరాహారదీక్ష

కరోనా సాయం కోసం ఆలపాటి నిరాహారదీక్ష
విజయవాడ ఏప్రిల్ 15 
కరోనా సాయంగా ప్రతి నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం 5000 వేల రూపాయలు తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నిరాహార దీక్ష ప్రారంభించారు. రాష్టంలో కరోనా సోకి మృతి చెందిన ప్రతి కుటుంబానికి 25 లక్షల ఎక్స్ గ్రేషియాను  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.తన నివాసంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేస్తున్న  12గంటలు నిరాహార దీక్ష కార్యక్రమానికి  గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి కోవెలమూడి నాని సంఘీభావం తెలిపారు.ఆయనతో బాటు తెలుగు యువత నాయకుడు అమరావతి యువజన జెఏసి కన్వీనర్ రావిపాటి సాయి కృష్ణ కూడా తన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని రావిపాటి సాయి కృష్ణ డిమాండ్ చేశారు.

Related Posts