YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

మద్యం విక్రయాలపై ఉక్కు పాదం

మద్యం విక్రయాలపై ఉక్కు పాదం

మద్యం విక్రయాలపై ఉక్కు పాదం
హైదరాబాద్ ఏప్రిల్ 15 
రాష్ట్ర  అబ్కారి,  క్రీడా, పర్యాటక,  సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస్ గౌడ్ బుధవారం నాడు  ప్రొహిబిషన్,  ఎక్సైజ్ శాఖ పై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం హైదరాబాద్ లో రవీంద్ర భారతి లోని తన కార్యాలయంలో నిర్వహించారు.  ఈ సమీక్ష సమావేశంలో రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో నిబందనలకు విరుద్దంగా మద్యం దుకాణాల ద్వారా లిక్కర్ లీక్ అవ్వడం, అక్రమ మద్యం తయారీ,  సరఫరా తదితర అంశాలపై  చర్చించారు. ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాల ద్వారా మద్యం తరలించి ఎక్కువ ధరలకు అమ్మడం వంటి చర్యలను మంత్రి తీవ్రంగా పరిగణించారు. ఇందుకు కారకులైన లైసెన్స్ లను సస్పెండ్ చేయడం, భారీ అపరాధ రుసుం విధించడం, కొన్ని తీవ్రమైన కేసులలో లైసెన్స్ ను క్యాన్సల్ చేయడం జరుగుతుందని మంత్రి అధికారులకు హెచ్చరించారు.  అలసత్వం ప్రదర్శించినా, సహకరించిన స్థానిక అధికారులపై తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.  ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ తీసుకున్న చర్యల వల్ల ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింప్టమ్స్  చాలా తగ్గిందన్నారు. మొదట్లో రోజుకి 140 నుండి 150 కేసులు ఎర్రగడ్డ ఆసుపత్రికి వచ్చాయన్నారు కానీ నేడు డిపార్ట్మెంట్ వారు తీసుకున్న నివారణ చర్యలు, అవగాహన సదస్సుల వల్ల నేడు రోజుకు 2 లేదా మూడు కేసులకు తగ్గాయిని, త్వరలో మరికోద్ది రోజులలో ఇలాంటి కేసులు పూర్తిగా తగ్గిపోతాయన్నారు. మద్యం షాపుల గురించి ఎన్నో ఫిర్యాదులు వస్తున్నాయని అన్నింటినీ పరిశీలించి ఎక్సైజ్ శాఖ టాక్క్ ఫోర్క్ ద్వారా నిజాల ఆధారంగా సత్వరంగా స్పందించి శాఖ తరపున కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అందుకు బాధ్యులైన వారిపై కేసు నమోదు చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.  సోషల్ మీడియా ద్వారా వస్తున్నటువంటి అసత్య వార్తలను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు ఆదేశించారు. అలాగే నిన్న ట్విట్టర్లో కూలీలకు మద్యం పంచుతూ హైదరాబాద్ లోని చంపాపేట నుండి వచ్చిన వీడియో ఆధారిత ఫిర్యాదు ను అబ్కారి శాఖ అధికారులు నాలుగు, ఐదు గంటల్లోనే సదురు వ్యక్తిని సంజు కుమార్ ను గుర్తించి అరెస్టు చేయడం , తెలంగాణ ఎక్సైజ్ యాక్ట్ సెక్షన్ – 34 (ఎ) , 8 (బి)   ఆప్ ప్రోషిబిషన్ యాక్ట్ 1995 ప్రకారం చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.   ఈ సమీక్షా సమావేశంలో అబ్కారి శాఖ డైరెక్టర్  సర్పరాజ్ అహ్మద్, జాయింట్ కమీషనర్  అజయ్ రావు, తెలంగాణ బెవరేజేస్ కార్పోరేషన్ ప్రత్యేక అధికారు  సంతోష్ రెడ్డి, అసిస్టేంట్ కమీషనర్ హరికిషన్, హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ మరియు తదితర డిప్యూటి కమీషనర్లు వివేకనందా రెడ్డి , ఖురేషి, కె ఎ బి శాస్త్రీ, ఎక్సైజ్ సూపరిడెంట్ లు దత్తరాజ్ గౌడ్, చంద్రయ్య, జనార్ధన్ రెడ్డి , శీలం శ్రీనివాస్ రావు, గణేష్ గౌడ్, ప్రధీప్ రావు, రఘురామ్ మరియు అధికారులు పాల్గోన్నారు.

Related Posts