YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విమానాలు మే 3 తర్వాతే..

విమానాలు మే 3 తర్వాతే..

విమానాలు మే 3 తర్వాతే..
కానీ ఇప్పుడే ఆన్ లైన్ లో పేర్లు నమోదు చేసుకోవచ్చు
జగిత్యాల  ఏప్రిల్ 15
భారత్ లో లాక్ డౌన్ గడువు అయిన మే 3 తర్వాతనే విమానాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంటుంది, అయినప్పటికీ ఓమాన్ నుండి భారత్ కు వెళ్లాలనుకునే వారు ఇప్పుడే ఆన్ లైన్ ఫారం నింపి పేరు నమోదు చేసుకోవచ్చని మస్కట్ లోని ఇండియన్ ఎంబసీ బుధవారం  న ఒక ట్రావెల్ అడ్వయిజరీ (ప్రయాణ సలహా) ప్రకటన జారీ చేసింది. భారత్ కు విమానాలు తిరిగి ప్రారంభించడం లేదా ప్రత్యేక విమానాల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని కోరుతూ ఒమన్ లోని ప్రవాస భారతీయులు చాలామంది కాల్స్ చేస్తున్నారని  తెలిపారు. భారతదేశానికి ప్రయాణీకుల విమానాలను తిరిగి ప్రారంభించాలనే నిర్ణయం వెలువడిన వెంటనే రాయబార కార్యాలయం అధికారిక ప్రకటన చేస్తుంది. మనవారు ఒమన్‌లో ఎక్కడ ఉన్నా సురక్షితంగా ఉండాలని, ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించాలని ఆ ప్రకటనలో సూచించారు.
 

Related Posts