YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

క్వారంటైన్ బాధితులు ఆత్మహత్య  

క్వారంటైన్ బాధితులు ఆత్మహత్య  

క్వారంటైన్ బాధితులు ఆత్మహత్య  
పాట్నా, ఏప్రిల్ 15 
భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరిగిపోతుంది.ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య దేశంలో11వేలు దాటేశాయి. మరణాలు కూడా 400కు చేరువలో ఉన్నాయి. దీంతో సర్వత్రా ఈ వైరస్ పై ఆందోళన వ్యక్తమవుతోంది. కొందరు ఈ వైరస్ లక్షణాలతో లేనిపోని అఘాయిత్యాలు చేసుకుంటున్నారు. వైరస్ తమకు సోకిందన్న భయంతో కొందరు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా బీహార్‌లో ఇలాంటి దురదృష్టకరమైన ఘటన చోటుచేసుకుంది.బీహార్‌‌లోని దర్బంగా జిల్లాకు ఒక వ్యక్తి (43 ఏళ్లు) క్వారంటైన్‌ సెంటర్‌‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నెల 10న ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని కుమ్రౌలీలోని ఒక పాఠశాలలో ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ సెంటర్‌‌కు తరలించారు. కాగా.. సోమవారం రాత్రి రూమ్‌లోని కిటికీకి టవల్‌తో ఉరివేసుకుని చనిపోయాడని పోలీసులు చెప్పారు. అయితే ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తి చాలా రోజులుగా టీబీతో బాధపడుతున్నట్లు అధికారులు తెలిపారు. దాని వల్ల ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోందని వైద్యులు అన్నారు. టీబీతో పాటు కుటుంబ సమస్యల వల్లే అతను చనిపోయాడని జిల్లా కలెక్టర్‌‌ త్యాగరాజన్‌ చెప్పారు.క్వారంటైన్‌ కేంద్రానికి వచ్చినప్పుడే తనకు టీబీ ఉందని చాలా ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. వైద్యులు అతనికి అవసరమైన ఆహారం, మందులు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 11న ఉత్తర్ ప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో హోం క్వారంటైన్‌లో ఉన్న 21 ఏళ్ల ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వైరస్ భయంతోనే కొందరు ఇలా ప్రాణాలు తీసుకుంటున్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. అవసరమైన చికిత్స అందిస్తే... కరోనా నుంచి క్షేమంగా బయటపడొచ్చని ధైర్యం ఇస్తున్నారు

Related Posts