YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం దేశీయం

. 45వేలకు చేరిన పసిడి

. 45వేలకు చేరిన పసిడి

. 45వేలకు చేరిన పసిడి
ముంబై, ఏప్రిల్ 16
బంగారం ధగధగమంటోంది. మెరిసిపోతోంది. పసిడి ర్యాలీ చేస్తూనే వస్తోంది. ఈరోజు కూడా ఇదే ట్రెండ్ కనిపించింది. బంగారం ధర పరుగులు పెట్టింది. పసిడి ధర పైకి కదలడం ఇది వరుసగా ఏడో రోజు కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర పెరుగుదల కారణంగా మన మార్కెట్‌లోనూ పసిడి ధర పైకి కదిలిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం పడిపోయింది.హైదరాబాద్ మార్కెట్‌లో గురువారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఏకంగా రూ.110 పెరుగుదలతో రూ.45,760కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,960కు ఎగసింది.పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం దిగొచ్చింది. కేజీ వెండి ధర రూ.60 తగ్గింది. దీంతో వెండి ధర రూ.41,850కు క్షీణించింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ తగ్గడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. పసిడి ధర ఔన్స్‌కు 0.22 శాతం పెరిగింది. ఔన్స్‌కు 1744.25 డాలర్లకు చేరింది. బంగారం ధర పెరిగితే.. వెండి ధర కూడా ఇదే దారిలోనే నడిచింది. వెండి ధర ఔన్స్‌కు 0.61 శాతం పెరుగుదలతో 15.60 డాలర్లకు చేరింది.దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో కూడా పసిడి ధర పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110 పెరుగుదలతో రూ.43,650కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.110 పెరుగుదలతో రూ.45,910కు ఎగసింది. ఇక కేజీ వెండి ధర కూడా రూ.60 తగ్గింది. దీంతో ధర రూ.41,850కు క్షీణించింది.ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Related Posts