YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అబద్దపు ప్రచారం, వెధవ ప్రచారం,

అబద్దపు ప్రచారం, వెధవ ప్రచారం,

 అబద్దపు ప్రచారం, వెధవ ప్రచారం,
తాడేపల్లి, ఏప్రిల్ 16
కోవిడ్ -19 తో రాష్ర్టం అట్టుడుకి పోతుంటే రాష్ర్టానికి సంబంధించి ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ గారు రాష్ర్టంలో మొట్టమొదటి కేసు వచ్చిందగ్గర్నుంచి ప్రతి రోజూ రివ్యూచేస్తూ ఎక్కడ ఏ విధంగా చర్యలు చేపట్టాలి. ఏ విధంగా పేదలు, రైతులు ఇబ్బంది పడకూడదని చెప్పి వారి బాగోగులు చూస్తూ కరోనాను ఎలా కట్టడి చేయాలా అని జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాష్ట్ర జలవనరుల శాఖమంత్రి  అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు ఇక్కడ మంత్రుల సబ్ కమిటి, జిల్లాలోమంత్రులు, నియోజకవర్గ స్దాయిలో టాస్క్ ఫోర్స్ ఏర్పాటుచేసి కరోనా నియంత్రణకు పోలీసు, శానిటరీ, రెవిన్యూ, వైద్యఆరోగ్యసిబ్బంది అంతా డే అండ్ నైట్ కష్టపడుతూ ముందుకు వెళ్తున్నారు. ఒక జాతీయ న్యూస్ ఛానల్ భారతదేశంలోనే  మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ఇన్ లాక్ డౌన్ అని తీసుకుంటే  అది ఆంధ్రప్రదేశ్ గా పేర్కొందని అయన అన్నారు లాక్డౌన్ లో కేసులు తగ్గించడంలోగాని, జాగ్రత్తలు తీసుకోవడంలోగాని మొట్టమొదటిస్ధానం ఏపికి వచ్చిందంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి  ముందుచూపే కారణం. వాస్తవానికి చంద్రబాబు నాయుడు లాగా రోజూ వచ్చి అబద్ధాలు చెప్పడం హడావుడిగా ప్రెస్ మీట్లు పెట్టడం, దానిని ఒక ఈవెంట్ గా చేసుకునే మనస్తత్వం జగన్ కు  లెదు. తన పని తాను చేసుకుంటూ పనిమాట్లాడాలి. పబ్లిసిటి కాదు అనే విధంగా మా ముఖ్యమంత్రి ముందుకు వెళ్తుంటారు. అదే విధంగా పనులు జరుగుతున్నాయని అయన అన్నారు.రాష్ట్రం  అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంధా వీడటం లేదు.ఆయన ఈ రాష్ట్రంలో లేడు.  పక్క రాస్త్రంలో ఉన్నాడు. ముసలివాళ్లు, చిన్నపిల్లలకు జాగ్రత్తలు తీసుకోమంటున్నాం. చంద్రబాబు నాయుడుకు వయస్సు పైబడింది.  కాబట్టి  ఆయనను తిరగమని కాని, లేకపోతే ప్రజలకు దగ్గర ఉండాలని ఎవరూ కోరుకోరు. .ప్రభుత్వం కూడా ఆయనను హౌస్ ఐసోలేషన్ లో జాగ్రత్తగా ఉండమని చెబుతోంది. పక్క రాష్ట్రంలో కూర్చుని వాళ్ల చెంచాలతో అబద్దపు ప్రచారం, వెధవప్రచారం, తప్పుడు ప్రచారాలు, చిల్లరరాజకీయాలు  చేస్తున్నారు. కరోనా సమయంలో కూడా టిడిపి నేతలు రాజకీయం చేస్తున్నారు. కనీసం చంద్రబాబు కూడా సహాయం చేయడం లేదు. టిడిపి నేతలు రాష్ట్రంలో ఎక్కడైనా ప్రజలకు సహాయం చేస్తున్నారా. అది కూడా లేదని మంత్రి విమర్శించారు. ఈ రోజు ఆయన రాలేదు. ఆయన కుమారుడుది వయస్సు చిన్నదేగా. ఆయనైనా కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నాడా అంటే ఆయన ఎలా ఎక్కడకు పోయాడో కూడా తెలియదు. కాని తప్పుడు రాజకీయాలు చేస్తూ శునకానందం పొందుతున్నారు.  హైకోర్టు ఇంగ్లీషు మీడియంపై ఆదేశాలు ఇస్తే దానికి ఏదో సంబరపడిపోయి ప్రభుత్వం ఏదో ఇదైనట్లు వీళ్లేదో విజయం సాధించినట్లు ఈయన, రెండు మీడియా ఛానల్స్ నానా హడావుడి చేస్తున్నారు. నేను సూటిగా అడుగుతున్నాను. మా విధానం ప్రతి ఒక్కరికి మంచివిద్య అందించాలి. బడుగు బలహీనవర్గాలు, మైనారిటీల పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో ఉన్నతస్దానాలకు ఎదిగేవిధంగా చేయాలనేది మా ప్రభుత్వం లక్ష్యం. ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీరికి తెలుగంటే ఇష్టం లేదు.అని మాట్లాడుతున్నారు.తెలుగుదేశం పార్టీ వారిని అడుగుతున్నాను,ఇంగ్లీషు మీడియం మీ బిడ్డలకేనా....పేదవర్గాలైన ఎస్సిఎస్టిబిసి మైనారిటీల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకుని ఉన్నతస్ధాయికి పోగూడదా అని మంత్రి ప్రశ్నించారు.

Related Posts