కుటుంబానికి ప్రభుత్వం 5 వేలు నగదు ఇవ్వాలి
టిడిపి నేత కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి
నెల్లూరు ఏప్రిల్ 16
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న లాక్ డౌన్ పీరియడ్ లో సామాన్య ప్రజలు అందరికీ ప్రతి కుటుంబానికి 5 వేల నగదు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలుగు దేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్థానిక చిల్డ్రన్ పార్క్ రోడ్, రాంజీ నగర్ లో ఉన్న ఆయన నివాసంలో బుధవారం నిరసన దీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ మహామారి కరువు నేపథ్యంలో నెల్లూరు జిల్లా ప్రజలందరికీ, కుటుంబాన్ని 5000 రూపాయలు నగదు చెల్లించాలని డిమాండ్ చేశారు. కరెంటు బిల్లలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రెడ్ జోన్లుగా ప్రకటించబడిన ప్రాంతాలలో నివాసాలు ఉన్న వారందరికీ ఉచితంగా నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు . ఈ దీక్ష కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.