కిందపడినా మాదే పైచేయి అనే రకాలు వైసీపీ నేతలు
పంచుమర్తి అనురాధ
విజయవాడ ఏప్రిల్ 16
కిందపడినా మాదే పైచేయి అనే రకాలు వైసీపీ నేతలు అని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఏడాదిలో 55 సార్లు కోర్టులు చివాట్లు పెట్టినా వైసీపీ మూర్ఖపు ఆలోచనల్లో మార్పు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలో తెలుగుతో పాటు ఇంగ్లిషు మీడియం ప్రారంభించామని తెలిపారు. మీడియం ఎంచుకునే అవకావశం పిల్లలకు, తల్లిదండ్రులకు టీడీపీ కల్పించిందన్నారు. ఆప్షన్ ఇచ్చినప్పటికీ.. వైసీపీ నేతల చిల్లర రాజకీయం అందరూ చూశారని అనురాధ ధ్వజమెత్తారు. ఇంగ్లీషు నేర్పొద్దని ఏ రాజకీయ పార్టీ చెప్పలేదని పేర్కొన్నారు. ఆప్షన్ తల్లిదండ్రులకు, పిల్లలకు ఇవ్వాలని కోర్టు చెప్పిందన్నారు. హైకోర్టులో అన్ని విషయాలు బయటపడ్డాయని... అయినా, ఇంగ్లీషు నేర్పొద్దని అంటారా? అని నటించడం వైసీపీ నేతలకే చెల్లిందని దుయ్యబట్టారు.