బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
- రాయపాటి
గుంటూరు ఏప్రిల్ 16
కమ్మవాళ్ళు తలచుకుంటే జగన్ రెడ్డి లేచిపోతాడని తాను వ్యాఖ్యానించలేదని, వైసిపి ప్రభుత్వం లో కమ్మ కులస్తులు పట్ల జరుగుతున్న వివక్షపైనే తాను మాట్లాడనని మాజీ ఎంపి రాయపాటి సాంబశివరావు అన్నారు. సీఎం స్థాయి వ్యక్తి తరచు కులాల ప్రస్తావన తేవడం నన్ను బాధించింది. జగన్ రెడ్డి పది కాలలపాటు సీఎం గా కొనసాగాలంటే అందరినీ కలుపుకుపోవాలని సలహా ఇచ్చాను. అయితే రాత్రి నుండి వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయి అని.ఫ్యాక్షన్ రాజకీయాలకు తొలినుండి మా కుటుంబం వ్యతిరేకం అని ఆయన అన్నారు. సోషల్ మీడియాలో తనపై అసభ్యంగా వ్యాఖ్యలు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.