YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్ట్

ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్ట్

ఎయిర్ పోర్టులో కోవిడ్ టెస్ట్
బీజింగ్, ఏప్రిల్ 16
చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన ప్రాణాంతక కొత్తరకం కరోనా వైరస్.. మూడు నెలల్లోనే మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించింది. వాయువేగంతో ప్రపంచాన్ని చుట్టేసిన మహమ్మారి.. ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లేందుకు ఒక రకంగా విమాన ప్రయాణాలు దోహదం చేశాయి. విమానాలు ఎంత వేగంగా గమ్యానికి చేరుస్తాయో.. కరోనా వైరస్‌ కూడా ప్రపంచదేశాలకు అంతే వేగంగా పాకింది. కాగా.. విమాన ప్రయాణికుల్లో వైరస్‌ ఎవరికి ఉందో? తెలుసుకోలేకపోవడం వైరస్‌ ఇంత వేగంగా వ్యాపించింది. ఇప్పటి వరకూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్‌ పరీక్షలు మాత్రమే నిర్వహించి.. వారి శరీర ఉష్ణోగ్రతను బట్టి కరోనా లక్షణాలు గుర్తించేవారు.కరోనా వైరస్‌ను స్వల్ప వ్యవధిలోనే గుర్తించే సాంకేతిక పరిజ్ఞానం ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. కేవలం ఏడు నిమిషాల్లోనే కరోనా నిర్ధారణ పరీక్షను నిర్వహించే కిట్‌లను దక్షిణ కొరియా అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. తాజాగా, ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ సాయంతో కేవలం పది నిమిషాల్లోనే కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష నిర్వహించే సదుపాయాన్ని ప్రముఖ విమానయాన సంస్థ ఎమిరేట్స్‌ బుధవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. విమానాశ్రయాల్లో కొవిడ్‌-19 నిర్ధారణ పరీక్ష నిర్వహించడం ఇదే తొలిసారని ఎమిరేట్స్ వెల్లడించింది.విమాన ప్రయాణాలపై పరిమితంగా ఆంక్షలు సడలించడంతో విమాన సర్వీసులు ప్రారంభమైన నేపథ్యంలో ఈ ఏర్పాట్లు చేశామని ప్రకటించింది. స్వస్థలాలకు వెళ్లాలనుకునే విదేశీ ప్రయాణీకులు కోసమే సర్వీసులను పునరుద్దరించినట్టు తెలిపింది. తొలుత దుబాయి నుంచి ట్యునీషియా వెళ్లిన ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ప్రయాణం ప్రారంభానికి ముందు ప్రయాణీకుల నమూనాలు సేకరించి కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్ష చేస్తారు. వీటికి సంబంధించిన ఫలితం కేవలం పది నిమిషాల్లోనే వస్తుందని ఎమిరేట్స్‌ సంస్థ పేర్కొంది. రాబోయే రోజుల్లో ఇదే విధానాన్ని దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు వర్తింపజేస్తామని ఎమిరేట్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అదిల్ అల్ రెధాహ్ పేర్కొన్నారు.అరబ్‌ దేశాల్లో ఇప్పటివరకు దాదాపు 5వేల మందికి కరోనా సోకగా 28మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌డౌన్‌తో పాటు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. కేవలం విదేశీయులను మాత్రమే తరలిస్తుండగా.. బయట ప్రయాణికులను అనుమతించడంలేదు. మధ్య ఆసియాలోనే అతిపెద్ద విమానయాన సంస్థగా ఎమిరేట్స్ గుర్తింపు పొందింది. దేశంలో ఒక్కసారిగా కేసులు పెరడగంతో ఏప్రిల్ 4న రెండు వారాల లాక్‌డౌన్ ప్రకటించింది.

Related Posts