YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం తెలంగాణ

20 తర్వాత ఐటీ కంపెనీల పనిపై అనుమానేమే

20 తర్వాత ఐటీ కంపెనీల పనిపై అనుమానేమే

 

20 తర్వాత ఐటీ కంపెనీల పనిపై అనుమానేమే
హైద్రాబాద్, ఏప్రిల్ 17 
రోనా కల్లోలంతో అన్ని రంగాలూ కుదేలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 20 నుంచి కాస్త సడలింపులు ఇచ్చి వివిధ పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించుకునేలా వెసులుబాటు కల్పించింది. ఇందుకు సంబంధించి మార్గదర్శకాలను విడుదల చేసింది. 50 శాతం మానవ వనరులతో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించుకోవచ్చని స్పష్టం చేసింది. కానీ, తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడంలేదు. 80 శాతం ఐటీ కంపెనీలు కోవిడ్-19 హాట్‌స్పాట్లు, కంటైన్‌మెంట్ ప్రాంతాల్లో ఉండటమే అందుక్కారణం. ముఖ్యంగా దిగ్గజ కంపెనీలన్నీ ఈ హాట్‌స్పాట్లలోనే ఉన్నాయి. అంతేకాదు.. హైదరాబాద్‌లో నమోదైన తొలి కేసులో బాధితుడు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజనీరే కావడం గమనార్హం.గ్రీన్ జోన్లలో ఆయా సంస్థలు తమ కార్యకలాపాలు పున:ప్రారంభించేలా కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో అనుమతి ఇచ్చింది. కరోనా వైరస్ ప్రభావాన్ని పూర్తిగా తొలగించిన ప్రాంతాలను గ్రీన్ జోన్లుగా పేర్కొంటున్నారు. హాట్‌స్పాట్లలో కార్యకలాపాలు ప్రారంభించడానికి అనుమతి లేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ఐటీ కంపెనీల పరిస్థితి డోలాయమానంలో ఉంది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఉన్న చాలా ఐటీ కంపెనీలు కోవిడ్-19 హాట్‌స్పాట్లలోనే ఉన్నాయి. ఐటీ కంపెనీలు అధికంగా ఉన్న శేరిలింగంపల్లి పరిధిలో 16 కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఇ-కామర్స్ కంపెనీలు కూడా తమ కార్యకలాపాలు పున:ప్రారంభించుకోడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ, గురువారం (ఏప్రిల్ 16) ఢిల్లీలో ఓ డెలివరీ బాయ్‌ కరోనా వైరస్ బారినపడ్డట్లు నిర్ధారణ కావడంతో ఇది కూడా ప్రశ్నార్థకంగా మారింది.లాక్‌డౌన్ ప్రారంభించడానికి ముందే తప్పనిసరి పరిస్థితుల్లో 20 శాతం ఉద్యోగులతో మాత్రమే కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రస్తుతం ఐటీ రంగంలో 95 శాతం ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారు.ఏప్రిల్ 20 తర్వాత ఐటీ కంపెనీలకు కార్యకలాపాలకు అనుమతించే విషయంపై ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌ను ప్రశ్నించగా.. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని వెల్లడించారు. ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో దీనికి సంబంధించి విధి విధానాలు నిర్ణయించవచ్చని ఆయన తెలిపారు. పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, ఇ-కామర్స్ సంస్థలు తమ కార్యకలాపాలు కొనసాగించేందుకు తగిన పరిస్థితులు కల్పించే అవకాశాలు ఉన్నాయని జయేశ్ రంజన్ చెప్పారు. కేసీఆర్ సర్కార్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
 

Related Posts