YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

కరోనా కట్టడిలో కేరళ....

కరోనా కట్టడిలో కేరళ....

కరోనా కట్టడిలో కేరళ....
తిరువనంతపురం, ఏప్రిల్ 17
దేశంలో ఫస్ట్ కరోనా కేసు నమోదైన రోజది. ఆ ఫస్ట్ కేసు రికార్డ్ అయింది కేరళలో. ఫస్ట్ మూడు కేసులు అక్కడే. అది మొదలు ఇప్పటిదాకా రెండున్నర నెలల్లో అక్కడ నమోదైన మొత్తం కేసులు 394. చనిపోయింది ఇద్దరు. 56 శాతం మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రోజూ నమోదవుతున్న కొత్త కేసుల సంఖ్య బాగా తగ్గింది. సింగిల్ డిజిట్కు వచ్చేసింది. వేరే రాష్ట్రాలతో పోలిస్తే కేరళ మెరుగైన పొజిషన్లోనే ఉందని చెప్పొచ్చు. దానికి కారణం ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఓ యంగ్ డైనమిక్ కలెక్టర్ తెలివితేటలే. ఒక్క మాటలో చెప్పాలంటే.. కేరళ సర్కార్ తీసుకున్న పటిష్టమైన చర్యలే ఇప్పుడు ఆ రాష్ట్రాన్ని అంతో ఇంతో సేఫ్జోన్లో ఉంచాయి.పీబీ నూహ్ పథనంథిట్ట కలెక్టర్. వుహాన్ నుంచి వచ్చిన ఓ మెడికల్ స్టూడెంట్కు కరోనా పాజిటివ్ రావడంతో రాత్రి 11.30 గంటలకు  చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ ఒక్క కేసుతో మరిన్ని రాకుండా డాక్టర్లు, తోటి అధికారులతో చర్చ నడిచింది. తెల్లవారుజామున 3 గంటలకు  డబ్ల్యూహెచ్వో సూచించిన ఫార్ములా ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తులను కలిసినోళ్లను గుర్తించడం, వాళ్లను ఐసోలేషన్కు తరలించడం, వారిపై నిఘా ఉంచడం వంటి వాటిని ఫాలో అయ్యారు. అందుకు పేషెంట్లనే ఆధారంగా చేసుకున్నారు. వాళ్లు ఇచ్చిన వివరాలు, వాళ్ల కదలికలను ఎప్పటికప్పుడు మానిటర్ చేశారు. ఎయిర్పోర్టుల్లో స్క్రీనింగ్ను స్ట్రిక్ట్ చేశారు. డౌట్ వచ్చినవాళ్లను క్వారంటైన్లో పెట్టారు. పాజిటివ్గా తేలినోళ్లను ఐసోలేషన్కు పంపించారు. ఫిబ్రవరి 29న నూహ్కు సీఎస్ నుంచి ఫోన్ వచ్చింది. పథనంథిట్ట జిల్లాలోని రణికి చెందిన ముగ్గురు ఇటలీలోని వెనిస్ నుంచి వచ్చి… కొచ్చి ఎయిర్ పోర్టులో స్క్రీనింగ్ టెస్టులను తప్పించుకుని ఓ క్యాబ్లో 200 కిలోమీటర్ల దూరంలోని రణికి వచ్చారని చెప్పారు. వాళ్లకు టెస్టులు చేస్తే మార్చి 7న ముగ్గురికీ పాజిటివ్ అని తేలింది. వాళ్ల ఇద్దరు బంధువులకూ వైరస్ సోకింది. వాళ్లు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరెవరిని కలిశారన్నది మాత్రం అధికారులకు చెప్పలేదు. అధికారులకు సహకరించలేదు. అప్పటికి దేశంలో 31 మందికి వైరస్ సోకింది. ఇలాంటి టైంలో ఏం చేయాలన్నది నూహ్కు తోచలేదు.2018 వరదలప్పుడు నూహ్కు సహాయ చర్యల్లో పాల్గొన్న అనుభవం ఇక్కడ పనికొచ్చింది.  కరోనా సోకిన ఆ ముగ్గురు ఎలాగూ వివరాలు చెప్పరని నూహ్కు అర్థమైంది. దీంతో వరదలప్పుడు వాడిన డిటెక్టివ్ స్టైల్ వర్క్ను, టెక్నాలజీని వాడాలని డిసైడ్ అయ్యారు. పోలీసులు, మెడికల్ సిబ్బంది, వలంటీర్లతో కూడిన 50 మంది టీమ్ను రెడీ చేశారు. అందరినీ టీమ్లుగా విభజించారు. ఆ ముగ్గురి మొబైల్స్లోని జీపీఎస్ డేటా, ఎయిర్పోర్టు, వాళ్లు తిరిగిన వీధులు, స్టోర్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. వాళ్లంతా వారంలోనే రద్దీ ఎక్కువగా ఉండే అన్ని ప్రాంతాలను తిరిగేశారు.నూహ్ ఏర్పాటు చేసిన ఒక్కో టీంలో అధికారుల సంఖ్య 6 నుంచి 15కు పెరిగింది. మార్చి 9న ఆ ఫ్యామిలీ 300 మందిని కలిసినట్టు నిర్ధారణకు వచ్చారు. వాళ్లందరినీ ట్రేస్ చేసిన నూహ్ టీమ్.. వాళ్లకున్న లక్షణాలను బట్టి క్వారంటైన్లో పెట్టడమో లేదంటే జిల్లా ఆస్పత్రికి తరలించారు. టెస్టులూ చేశారు. ఆ టైంకు మొత్తం 1,200 మందిని సెల్ఫ్ ఐసోలేషన్లో పెట్టేసింది సర్కార్. వాళ్లు ఐసోలేషన్లో ఉంటున్నారన్న గ్యారంటీ లేదు. దీంతో వాళ్ల మీద నిఘా పెట్టేందుకు ఓ కాల్సెంటర్ను తన ఆఫీసులో ఏర్పాటు చేశారు. 60 మంది మెడికల్ స్టూడెంట్లు, డిస్ట్రిక్ట్ హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందిని రప్పించారు. ఐసోలేషన్లో ఉన్న వారికి రోజూ ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవడమే వాళ్ల పని.అధికారుల ప్రయత్నాలతో రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. మార్చి 11 నాటికి రాష్ట్రంలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వెంటనే సీఎం పినరయి విజయన్ రంగంలోకి దిగారు. ఆలస్యం చేయకుండా రాష్ట్రమంతా లాక్డౌన్ ప్రకటించారు. దేశంలో ఫస్ట్ లాక్డౌన్ ప్రకటించిన రాష్ట్రంగా కేరళ నిలిచింది. స్కూళ్లను బంద్పెట్టారు. ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించారు. గుళ్లు, మసీదులు, చర్చిల్లో దర్శనాలు, ప్రార్థనలనూ బ్యాన్చేశారు. ప్రైవేటు సంస్థల ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేసేలా ఆర్డర్స్ పాస్ చేశారు. వాళ్లకు మెరుగైన ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకున్నారు. హ్యాండ్ శానిటైజర్లు, మాస్కుల ప్రొడక్షన్ను పెంచారు. స్కూళ్లలో మధ్యాహ్న భోజనాన్ని ఇంటికే పంపించే ఏర్పాట్లు చేశారు. 20వేల కోట్లతో రిలీఫ్ ప్యాకేజీ ఇచ్చారు. ఆరోగ్యానికే ప్రత్యేకంగా 5 వేల కోట్లు కేటాయించారు. ఫ్రీ రేషన్, లోన్ల కోసం 2 వేల కోట్లు, పల్లెల్లో ఉద్యోగాల కల్పన కోసం 2 వేల కోట్లు, పేదల కోసం వెయ్యి కోట్లు, 1,320 కోట్లను రెండు నెలల అడ్వాన్స్ పెన్షన్ల కోసం కేటాయించారు. 30 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లారు. అనుమానితుల ఆరా తీశారు. ఒక్కో కార్యకర్త రోజూ 200 మందిని కలిశారు. దీంతో సర్కార్పై ప్రజలకూ నమ్మకం పెరిగింది.నిజానికి దేశంలో మెరుగైన వైద్య సదుపాయాలున్న రాష్ట్రాల జాబితాలో కేరళ మొదటి స్థానంలో ఉంటుంది. మూడున్నర కోట్ల జనాభా ఉన్న ఈ చిన్న రాష్ట్రంలో 135 హాస్పిటల్స్ ఉన్నాయి. ప్రతి హాస్పిటల్లో వంద బెడ్లున్నాయి. అందులో 300 వరకు బెడ్లున్నవి 50 వరకున్నాయి. ప్రతి 200 మందికో డాక్టర్ ఉన్నారు. నర్సులకు కేరళ ఫేమస్. చాలా చోట్ల కేరళ నర్సులు పనిచేస్తుంటారు. ప్రస్తుతం డాక్టర్లతో పాటు కరోనాపై ముందుండి పోరాడుతోంది నర్సులే. అక్షరాస్యతలోనూ ఆ రాష్ట్రమే ఫస్ట్. 94 శాతం మంది చదువుకున్నోళ్లున్నారక్కడ. మార్చి 23 నాటికి పథనంథిట్ట జిల్లాలో పాజిటివ్ కేసులు 5 నుంచి 9కి పెరిగాయి. కేసుల కట్టడికి నూహ్ తీసుకున్న నిర్ణయాలే దానికి కారణమని అంటారు. మార్చి 28 నాటికి రాష్ట్రంలో 1.34 లక్షల మందిని క్వారంటైన్లో పెట్టారు. 620 మందిని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్చారు. మిగతా వాళ్లందరినీ ఇళ్లలోనే ఐసోలేట్ చేశారు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నోళ్ల సంఖ్య 1.62 లక్షలకు పెరిగింది. కేసులు 394 దగ్గర ఉన్నాయి. ఇప్పటికి అక్కడ చనిపోయింది ఇద్దరే. ఎక్కడికక్కడ వైద్య సదుపాయాలు కల్పించడం, అన్ని అందుబాటులోకి తీసుకురావడం వల్లే ఇది సాధ్యమైందంటారు నూహ్.నిజానికి కేరళలో  ట్రేసింగ్, టెస్టింగ్, ఐసోలేషన్లను ఆ టైంలోనే కేరళ పటిష్టంగా పాటించింది.

 

Related Posts