YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆరోగ్యం దేశీయం

భారత్ లో నెగిటివ్ ఎక్కువే

భారత్ లో నెగిటివ్ ఎక్కువే

భారత్ లో నెగిటివ్ ఎక్కువే
న్యూఢిల్లీ, ఏప్రిల్ 17 
దేశంలో కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలపై కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టత ఇచ్చింది. పాజిటివ్‌ కేసుల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే మిగతా దేశాల్లో మాదిరిగా పెద్ద సంఖ్యలో పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం రావడంలేదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్  వెల్లడించింది. మిగతా దేశాలకంటే భారత్‌లో పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ఐసీఎంఆర్ సీనియర్ అధికారి గంగాఖేడ్కర్ వ్యాఖ్యానించారు.. దేశంలో కరోనా నిర్ధారణ పరీక్షలను తక్కువ సంఖ్యలో నిర్వహిస్తున్నారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ చేసిన ఆరోపణలపై ఆయన వివరణ ఇచ్చారు.జపాన్‌లో ప్రతి 11.7 పరీక్షలకు ఒక పాజిటివ్‌ కేసు.. ఇటలీలో 6.7, అమెరికాలో 5.3, బ్రిటన్‌లో 3.4 పరీక్షలకు ఒక పాజిటివ్‌ కేసు వస్తోందన్నారు. మన దేశంలో మాత్రం 24 మందికి ఒకరికి మాత్రమే వైరస్ పాజిటివ్‌‌గా ఉన్నట్టు నిర్ధారణ అవుతోందన్నారు. జనాభా ఆధారంగా పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం లేదన్న ఆయన.. ఇప్పటివరకూ దేశంలో 2,90,401 మందికి పరీక్షలు నిర్వహించినట్టు తెలిపారు. బుధవారం ఒక్కరోజే 30,043 మంది నమూనాలను పరీక్షించామని, పరీక్షల నిర్వహణ కోసం విదేశాల్లోని విధానాన్నే అనుసరిస్తున్నట్టు గంగా ఖేడ్కర్‌ పేర్కొన్నారు. 24 మందికి పరీక్షలు నిర్వహిస్తే.. 23 మందికి నెగెటివ్‌గా వస్తుందని వివరించారు.దేశంలో కొంతవరకు వైరస్‌ను నియంత్రించగలిగామని, మన విధానం సరైందేనని ఇప్పటివరకూ వెల్లడైన ఫలితాలు చెబుతున్నాయని లవ్ అగర్వాల్ అన్నారు. మొత్తం 350 జిల్లాల్లో ఒక్క కేసు నిర్ధారణ కాలేదని, మరణాల రేటు 3.3 శాతంగా ఉందన్నారు. అలాగే, వైరస్ బాధితులు సగటు 12.02 శాత మంది కోలుకుంటున్నారని తెలిపారు. పుదుచ్చేరిలోని మాహె జిల్లాలో గత 28 రోజుల్లో ఒక్క కొత్తకేసు రాలేదని, 17 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో గత 14 రోజులుగా ఒక్క పాజిటివ్‌ కేసు కూడా నమోదు కాలేదని తెలిపారు. వీటిలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా ఉందని పేర్కొన్నారు. అలాగే అండమాన్‌లోని 11 మందికి వైరస్ సోకగా.. వారంతా కోలుకున్నారని, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో రిపోర్టులు నెగెటివ్‌గా వచ్చాయని వివరించారు. ఏ ఒక్క పాజిటివ్ కేసు కూడా వదలిపెట్టరాదనేది తమ అభిమతమన్నారు.

Related Posts