ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు: యనమల
విశాఖపట్నం ఏప్రిల్ 17
నెలల కాలంలో ఒక ముఖ్య మంత్రికి హైకోర్టు యాభై ఐదు సార్లు మొట్టికాయలు వేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుపేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి కుటుంబానికి 5 వేల రూపాయలు ఇచ్చి ప్రభుత్వం ఆదుకోకపోతే ఆకలి మంటలతో దాడులు జరుగుతాయని పేర్కొన్నారు. పేర్లు మార్చి అయినా అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా పథకాలను కొనసాగించాలని కోరారు. విశాఖ రాజధాని నేపథ్యంలో కరోనా కేసులు లేనట్టు ప్రభుత్వం సృష్టిస్తోందని యనమల విమర్శించారు.