YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

విమర్శలు మానుకోవాలి

విమర్శలు మానుకోవాలి

విమర్శలు మానుకోవాలి
విజయవాడ ఏప్రిల్ 18
విజయవాడ కృష్ణా నది వద్ద ఉన్న పేద బ్రాహ్మణులకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు నిత్యవసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేసారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రజలెవరూ ఆకలి బాధతో ఉండకూడదని లక్షమంది పైగా కుటుంబాలకు నిత్యవసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశాం. గ్రామ వాలంటీర్లు మీడియా సిబ్బంది ఇతర వర్గాలకు కూడా నిత్యావసర వస్తువుల పంపిణీ చేస్తున్నాం. ప్రభుత్వం అన్ని రకాలుగా ఆడుకుంటూంటే హైదరాబాద్ వాసి అయిన చంద్రబాబు అజ్ఞాతవాసి అయిన పవన్ కల్యాణ్ లు ప్రభుత్వం పైన విమర్శలు చేయడం మానుకోవాలని అన్నారు. కరోనా సమయంలో ప్రజలను ఆదుకోవడం చేయకుండా ప్రభుత్వంపై విమర్శలు చేయటం సమంజసమేనా. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయి. 10 నిమిషాల్లో కరోనా టెస్ట్ నిర్వహించే లక్ష ర్యాపిడ్ కిట్లు ప్రభుత్వం తీసుకుంది. కరోనాను నియంత్రించే చర్యల్లో ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని మంత్రి అన్నారు.

 

Related Posts