YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 పరిటాల సునీత నిరాహార దీక్ష

 పరిటాల సునీత నిరాహార దీక్ష

 పరిటాల సునీత నిరాహార దీక్ష
అనంతపురం ఏప్రిల్ 18
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు  నారా చంద్రబాబు నాయుడు   ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా  రాప్తాడు నియోజకవర్గం  వెంకటాపురం గ్రామంలో మాజీ మంత్రి పరిటాల సునిత  12 గంటల నిరాహారదీక్ష చేపట్టారు. ఆమె మాట్లాడుతూ  కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ఇబ్బంది పడుచున్న ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం 5వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలి.  గిట్టుబాటు ధరలు, మార్కెటింగ్,  రవాణా సౌకర్యం కల్పించి,   ధాన్యం, కూరగాయలు, పండ్లతోటల రైతులను ఆదుకోవాలని అన్నారు.  కరోనా నియంత్రణ కోసం పోరాడుతున్న వైద్యులు,  వైద్య సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, పోలీసులు, అధికారులు, పాత్రికేయులకు రక్షణ కిట్లు అందించాలి.  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మూసివేసిన ఎన్ టి ఆర్ క్యాంటీన్లను వెంటనే తెరచి పేద వాడి ఆకలిని తీర్చాలి.  చంద్రన్న భీమా పథకాన్ని తిరిగి ప్రారంభించాలి.  క్వారంటైన్లలో ఉన్న కరోనా అనుమానిత బాధితులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి.  రేషన్ పంపిణీలో ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేసారు.

Related Posts